ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్ !

మరో ఆరు నెలల తర్వాత అందరూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలని సీఎం జగన్ కేబినెట్ మంత్రులకు రూట్ మ్యాప్ ఖరారు చేసి చెప్పారు. ఆయన పీకే టీం గురించి కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం పని చేయడానికి వస్తుందని ఆయన మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే మూడేళ్లు పూర్తి కాగానే జగన్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే వైసీపీ పార్టీ నేతల్లోనూ చర్చనీయాంశమయింది. ముఖ్యమంత్రి మదిలో ముందస్తు ఆలోచన ఉందా అన్న చర్చ ప్రారంభమయింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు ముందుగానే జరుగుతాయి. అంటే 2023 ద్వితీయార్థంలోనే జరుగుతాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఆరు నెలలు లేదా ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఏడాది బడ్జెట్‌లో దళిత బంధు కోసం రూ. ఇరవై వేల కోట్లు కేటాయించి వాటినే మళ్లీ గెలిస్తే పంచుతామని ప్రకటిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దాని కోసం ఇప్పటికే బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని.. ముందస్తు కోసం వారి సహకారం తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళితే .. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లే ఆలోచన సీఎం జగన్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగడాన్ని ప్రాంతీయ పార్టీలు కోరుకోవు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకోవు. అందుకే జగన్ మదిలోనూ ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందని చెబుతున్నారు. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకోవడంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రుల్ని మార్చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల వంద శాతం మంత్రుల్ని మార్చేయాలన్న ఆలోచన చేశారన్న అభిప్రాయం కూడా వినిపించింది. కానీ ఉన్న మంత్రులకే అందరూ మంత్రుల హోదగాలోనే ప్రజల్లోకి వెళ్లాలన్న సందేశాన్ని పంపడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close