మోడీని బెదిరిస్తున్న ఆంధ్రా కాంగ్రెస్ నేతలు

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడి ఆంద్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, ఆర్ధిక సహాయం, ప్రాజెక్టులు వగైరాల కోసం హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నిటిని ఆయన నెరవేర్చారు కానీ అసలయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. అవి నెరవేర్చే ఉద్దేశ్యం లేనట్లే దాదాపు స్పష్టం అవుతోంది. ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ఆ హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి రూ.1.65 లక్షల కోట్లు భారీ ఆర్దిక ప్యాకేజీ ప్రకటించారు. అప్పుడు ఆంద్రప్రదేశ్ లో దీనిపై చాలా చర్చలు జరిగాయి కూడా.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో కొంచెం ఆలశ్యం మేల్కొన్నప్పటికీ మంచి సరయిన సమయంలో బీజేపీని నిలదీయడానికి సిద్దం అవుతోంది. “ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చేలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలుచేయడానికి నిర్దిష్ట గడువును ప్రకటించాలి. లేకుంటే మేము బీహార్ వెళ్లి అక్కడి ప్రజలకు నరేంద్ర మోడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏవిధంగా మోసం చేసింది వివరిస్తాము. బీహార్ రాష్ట్రానికి ఆయన ప్రకటించిన రూ.1.65 లక్షల కోట్లు ఆర్దిక ప్యాకేజీ అక్కడి ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు పొంది ఎన్నికలలో గెలిచేందుకే ఆ హామీని ప్రకటించారు తప్ప దానిని ఆయన అమలుచేయబోరని తాము ప్రచారం చేస్తామని,” ఆంద్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.

బీహార్ అసెంబ్లీకి ఐదు దశలలో ఎన్నికలు నిర్వహింపబడతాయి. వాటిలో రెండు దశలు ముగిసాయి. ఒకవేళ రఘు వీరారెడ్డి హెచ్చరిస్తున్నట్లుగా రాష్ర్ట కాంగ్రెస్ నేతలు బీహార్ వెళ్లి ఇదే విషయం గట్టిగా ప్రచారం చేసినట్లయితే బీజేపీ పట్ల ప్రజలకి అపనమ్మకం కలిగితే దాని విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని నరేంద్ర మోడి ఇప్పటికిప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర హామీలను అమలుచేస్తానని చెప్పడం కూడా కష్టమే. కనుక కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడను ఎదుర్కోవడానికి బీజేపీ ప్రతివ్యూహం సిద్దం చేసుకోకతప్పదు. కానీ ఆంధ్రా కాంగ్రెస్ నేతలలో చాలా మందికి సరిగ్గా హిందీ మాట్లాడటం రాదు. కనుక వారు అక్కడికి వెళ్లి దీని గురించి బీహార్ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడంకంటే జాతీయ కాంగ్రెస్ నేతలే ఈ విషయం గురించి బీహార్ లో గట్టిగా ప్రచారం చేసుకొంటే మంచిదేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close