అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానులు !

మూడు రాజధానులపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. అసెంబ్లీలోనే మంత్రి బొత్స ఈ అంశంపై సమగ్ర చర్చ జరుపుతామని ప్రకటించారు. అదే సమయంలో 21వ తేదీన మూడురాజధానుల బిల్లు పెట్టబోతున్నారని ఇతర వర్గాల ద్వారా మీడియాకు సమాచారం ఇప్పించారు. సీఎంతో భేటీ అయిన మూడు రాజధానుల ఉద్యకారులు బయటకు వచ్చి అదే ప్రకటన చేశారు. దీంతో అసెంబ్లీలో చర్చ జరపడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడు రాజధానుల బిల్లును మళ్లీ పెట్టడానికి ప్రభుత్వానికి రైట్ లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఇప్పుడు మళ్లీ అదే అంశంపై చర్చ పెట్టడం అంటే న్యాయవ్యవస్థతో ఘర్షణకు దిగినట్లే. దీనికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు హైకోర్టుల్లో వీగిపోతున్నా.. ఎక్కడా తగ్గడం లేదు. మూడురాజధానుల పై హైకోర్టు తీర్పు తర్వాతా.. వైసీపీ నేతలు అనేక మంది అనేకరకాలుగా స్పందించారు. వైసీపీ నేతలు మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్నారు.

అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెడితే.. చర్చించి ఆమోదిస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. హైకోర్టు తీర్పు నచ్చకపోతే ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తారు. కానీ అలా చేయకుండా నేరుగా కోర్టును ధిక్కరించాలనుకుంటే రాజ్యాంగంతో గొడవపడినట్లే అవుతుంది. దానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే జరిగితే ముందు ముందు ఏపీలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close