ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిషేధమా?

1953, నవంబర్ 1వ తేదీన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి 2014, జూన్2న రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేవరకూ ప్రతీ ఏటా నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఒక పండుగలా ఎంతో ఘనంగా జరిగేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తరువాత వరుసగా రెండుసార్లు ఎటువంటి కార్యక్రమం జరుపుకోకుండా గడిచిపోవడం బాధాకరం. జూన్ రెండున ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడిన రోజునే రాష్ట్రావతరణ దినోత్సవంగా తెలంగాణా ప్రభుత్వం ప్రకటించి ఎంతో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకొంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2ని రాష్ట్ర అవతరణ దినమని నిర్దిష్టమయిన ప్రకటన చేయకుండా ఆరోజు నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర పునర్నిర్మాణ దీక్షలు చేప్పట్టడం చేత, కనీసం జూన్ 2వ తేదీన అయినా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకాకుండానే ఈ ఏడాది కూడా గడిచిపోయింది.

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఇష్టం లేకపోతే కనీసం యధాప్రకారం నవంబర్ 1వ తేదీన నిర్వహించినా అందరూ సంతోషించేవారు. అదే విషయం కొందరు అధికారులు, మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో మొన్న నవంబర్ 1వ తేదీ కూడా సాధారణ దినంగానే ముగిసిపోయింది. ఒక పండుగలాగ జరుపుకోవలసిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంతాప దినంగా మార్చివేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర అవతరణ దినాన్ని నిర్దిష్టంగా ప్రకటించాలని అందరూ కోరుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close