పరీక్ష పాసైతేనే పర్మినెంట్.. వాళ్లకి షాకిచ్చిన ఏపీ సర్కార్..

రెండేళ్ల క్రితం పరీక్షలు పెట్టి నియమించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మళ్లీ పరీక్షలు పెడుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేసింది. రెండేళ్ల కిందట రూ. పదిహేను వేల జీతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల కింద ఉద్యోగుల్ని తీసుకున్నారు. వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని.. ప్రొబేషన్‌లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. మళ్లీ పరీక్షలు పెడతామని అప్పట్లో చెప్పలేదు. కానీ ఇప్పుడు తాము పెట్టే పరీక్షల్లో పాసవ్వాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. వంద మార్కులకు పెట్టబోయే పరీక్షలో కనీసం నలభై మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే ప్రొబేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించారు.

నెలాఖరులో మూడు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా ముఫ్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని ఇప్పటి వరకూ ప్రభుత్వం తాము కల్పించిన పర్మినెంట్ ఉద్యోగాల కేటగిరిలో వేసి లెక్కలు చెబుతూ వస్తోంది. అయితే వారు ఇంకా ప్రొబేషన్‌లోకి రాలేదు. ఇప్పుడు రావాలంటే పరీక్షలు రాయక తప్పని పరిస్థితి. ఎంత లేదన్నా వందకు వంద శాతం పరీక్షలు పాసయ్యే పరిస్థితి లేదు కాబట్టి వారిలో సగం మందికి మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పరీక్షలు పూర్తయిన తర్వాత కనీసం ఓ లక్ష మందికి ప్రొబేషన్ ఇచ్చినా ఆ మేరకు ప్రభుత్వం పై పెద్ద ఎత్తున భారం పడుతుంది. వారికి స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా లక్ష మందికి ప్రొబేషన్ ఇవ్వాలంటే అది మరిన్ని ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం పరీక్షలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close