అభివృద్ధి రద్దు..! గ్రామాల్లో చిన్న చిన్న పనులూ క్యాన్సిల్ ..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిలో.. 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పుడు… మూడున్నర నెలల తర్వాత ఆ పనులన్నీ…ప్రారంభించలేదన్న కారణంగా…రద్దు చేయడం ప్రారంభించారు. అంటే… పనులు ఆపేయమని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వమే. ఇప్పుడు.. పనులు చేయడం లేదని ఆ పనులను రద్దు చేస్తుంది కూడా ప్రభుత్వం. ప్రభుత్వం పనులు నిలిపి వేయాలనుంటే.. ఎంత ప్లాన్ ప్రకారం నిలిపివేస్తుందో.. పంచాయతీ రాజ్ శాఖలో మంజూరైన పనులన్నింటినీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో క్లారిటీ వచ్చేసిందని.. అధికార వర్గాలంటున్నాయి.

గ్రామాల్లో.. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కోసం… గత ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. అది నిరంతర ప్రక్రియ ఓ వైపు పనులు కొనసాగుతూంటే.. మరో వైపు కొత్త పనులు మంజూరు చేస్తూంటారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు ఎక్కువ మంజూరు అవుతుంటాయి. ఇలా ఏప్రిల్ కు ముందు 13 జిల్లాల్లో రూ.1031.17 కోట్ల విలువైన పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటన్నింటిని ఇప్పుడు, ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొందినా పనులు ప్రారంభం కాకపోవడంతో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నుంచి పోలవరం వరకు ప్రతీ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయింది.

చిన్న, మధ్య స్థాయి అభివృద్ధి పనులూ ఆగిపోయాయి. ఇప్పుడు గ్రామాల్లో.. చిన్న చిన్న రోడ్లు… ఇతర మౌలిక సదుపాయాల పనులనూ నిలిపివేశారు. సంక్షేమ పథకాలకు నిధులు సరిపోయే పరిస్థితి లేనందున.. ఇలా అభివృద్ధి పనుల నిధులన్నింటినీ… డబ్బు పంపిణీ పథకాలకు మళ్లించడానికే ఈ రద్దులు చేస్తున్నారన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close