“కాన్వాయ్‌”కీ డబ్బులు కట్టడం లేదట !

సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో ఆయన బయటకు వచ్చింది చాలా తక్కువ. జిల్లాల పర్యటనలకు వెళ్లింది పార్టీ నేతల పెళ్లిళ్లు, పేరంటాలతో పాటు ఎప్పుడైనా ఉపద్రవాలు వస్తే చూడటానికి వెళ్లారు. ఇలా వెళ్లినప్పుడు ఆయన కోసం రవాణా శాఖ కాన్వాయ్ ఏర్పాటు చేస్తుంది. ఆ కాన్వాయ్‌ ఏర్పాటు చేసినందుకు కార్లకు బిల్లులు చెల్లించాలి. కానీ అలాంటి పనులు చేయడం మానేసింది. కార్లను వాడుకోవడమే తప్ప.. బిల్లులు చెల్లించడం మానేసింది.

ఇప్పుడు సీఎం జగన్.. పథకాలకు మీటను ఇంట్లో ఉండి నొక్కడం లేదు. ఏదో ఓ ప్రాంతంలో సభ పెట్టి మీట నొక్కి .. విపక్షాలు, మీడియాపై తన బాధను .. ఆవేదనను.. కోపాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన కాన్వాయ్‌లు ఇక ముందు కొనసాగించాలంటే కనీసం రూ. పద్దెనిమిది కోట్లు ఇవ్వాలని రవాణాశాఖ రాసింది., ఎందుకంటే కాన్వాయ్‌లోకి కార్లు పెట్టాల్సిన వారు బిల్లులు అడుగుతున్నారట. మూడేళ్ల నుంచి పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా ఇక నుంచి జగన్ కాన్వాయ్‌కు కార్లు పెట్టేది లేదని చెబుతున్నారు.

దీంతో వారు నేరుగా ప్రభుత్వానికే లేఖ రాసి… మీడియాకు లీక్ చేశారు. అలా అయినా ఇస్తారేమోనని వారు ఎదురు చూస్తున్నారు. డబ్బులివ్వకపోవడం వల్ల రవాణాశాఖ అధికారులు ప్రజల మీద పడి వారి కార్లను ఎత్తుకెళ్తున్నారు. ఇటీవల ఒంగోలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రవాణా శాఖ అధికారులు తమ గోడు తాము వెళ్లబోసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం డబ్బులివ్వడం డౌటే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close