అయిననూ సుప్రీంకోర్టుకు..!?

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంపై ఏపీ సర్కార్ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్‌ఈసీ ఉల్లంఘించారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే… విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు… ఎన్నికల తేదీలను నిర్ణయించేటప్పుడు.. ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పిందని… ఈ విషయాన్ని ఎస్‌ఈసీ పట్టించుకోలేదని.. ఆయన అంటున్నారు. దీన్నే ప్రధాన అంశం చేసుకుని..ఎస్‌ఈసీ తమను సంప్రదించలేదని చెబుతూ…సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఎన్నికల షెడ్యూల్‌పై స్టే తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ఏపీ సర్కార్ ఓ రకంగా షాక్‌కు గురయింది. హైకోర్టు చెప్పినట్లుగా సంప్రదింపులు జరుపుతున్నామని.. వాటిని వీలైనంత వరకూ సాగదీయాలని అనుకుంది. అందుకే మొదటగా సీఎస్ నేతృత్వంలో ముగ్గురు అధికారులు వెళ్లి కాస్త మాట్లాడి.. ఓ లేఖ ఇచ్చి వచ్చారు. వచ్చేటప్పుడు.. మరోసారి పదిహేనో తేదీన కలుద్దామని చెప్పి వచ్చారు. అంటే అప్పటి వరకూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోరని అనుకున్నారు. కానీ.. వెంటనే నిమ్మగడ్డ షెడ్యూల్ ప్రకటించడంతో అధికారులకు మైండ్ బ్లాంక్ అయినట్లుంది. ఓ వైపు పై నుంచి వస్తున్న ఒత్తిడి.. మరో వైపు నిమ్మగడ్డ పట్టుదల కలగలిపి మధ్యలో ఉన్న అధికారులను టెన్షన్ పెడుతున్నాయి.

నిజానికి ఎస్‌ఈసీ కూడా.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… పథకాలను ప్రారంభించే ముందు… ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. పథకాలను ప్రారంభిస్తోంది. దీన్ని ఎస్‌ఈసీ ప్రభుత్వానికే రాసిన లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో.. ఎన్నికల షెడ్యూల్ విషయంలో… ఎస్‌ఈసీకే సర్వాధికారాలు ఉంటాయి. ప్రభుత్వ అనుమతితోనే ప్రకటన చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలంటూ… పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటన్నింటినీ కోర్టులు కొట్టి వేశాయి. అయినప్పటికీ.. అన్నీ తెలిసినా ఏపీ సర్కార్ మాత్రం… సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది.

ఏపీ సర్కార్ ఆలోచన… ఎన్నికల షెడ్యూల్‌పై ఎలాగైనా స్టే తెచ్చుకుంటే చాలనేనని.. కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సారి న్యాయస్థానం స్టే ఇస్తే.. మళ్లీ విచారణ జరిగి.. ఎన్నికలు నిర్వహించే సమయానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉండరని అంటున్నారు. అప్పుడు.. తమకు అనుకూలమైన వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని అంటున్నారు. మరి సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close