ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు కేసులు అడ్డం లేవా..!?

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 33 లక్షల మందికి ఇళ్లపట్టాలంటూ హడావుడి చేస్తూనే ఉంది. దాని కోసం.. భూములు సేకరించారు. వాటిలో చాలా వరకూ మొన్నటి వర్షాకాలంలోచెరువులువుగా మారాయి. మైనింగ్ భూములు, దేవాదాయ భూములు, స్మశానం భూములు ఇలా అన్నింటినీ ఇళ్ల స్థలాలు చేయాలనుకుంటే… కోర్టులు స్టే విధించాయి. ఇక మిగిలిన భూముల్లో..ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. నిన్నామొన్నటిదాకా వైసీపీ పెద్దలు ఒకటే ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అదే ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టు అడ్డుకుంటోందని… టీడీపీ నేతలు కేసులు వేశారని.. ఆ ఆరోపణల సారాంశం. మరి డిసెంబర్ 25నాటికి కోర్టు కేసులన్నీ తేలిపోతాయా.. అనే సందేహం చాలా మందిలో వస్తోంది.

నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీకి మొదటి ముహుర్తం.. ఈ ఏడాది ఉగాది. ఉగాదికి 33 లక్షల ఇళ్ల పట్టాలని ప్రభుత్వం హంగామా చేసింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ముందే ప్రకటించినందున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పట్టుబట్టారు. మార్చిలో ఎలక్షన్ కోడ్ వల్ల ఎస్‌ఈసీ ఆపేశారని ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కోడ్ ఎత్తేసినా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. వైఎస్ జయంతి.. గాంధీ జయంతి.. అంబేద్కర్ జయంతి.. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత విపక్షాలు కోర్టులకెళ్లి అడ్డుకున్నాయని ప్రచారం ప్రారంభించారు. కేసులు ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకు రెండు రోజుల కిందట.. కొడాలి నాని తనదైన భాషలో హెచ్చరించారు కూడా. కానీ ఇప్పుడు అదేమీ లేకుండానే పట్టాల పంపిణీకి ముహుర్తం ఖారారు చేశారు.

అంటే.. ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాల విషయంలో చెప్పిన.. చేసిన కోర్టు కేసుల ఆరోపణలన్నీ రాజకీయమేనని వైసీపీ నేతలే తేల్చేసినట్లయింది. ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్దాలేనని చెప్పినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా టిడ్కో ఇళ్ల రాజకీయం రాజుకుంటోంది. కట్టిన ఇళ్లు ఇవ్వకుండా లబ్దిదారులకు వేధింపులు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టిన ఇళ్లు ఇస్తే రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని మేనిఫెస్టోలో హామీ ఇ్చచారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు ఇస్తే రుణం మాఫీ చేయాల్సి వస్తుందని.. ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదనే విమర్శలు రావడానికి కారణం అవుతోంది. ఈ విషయంలో వైసీపీ, ప్రభుత్వం మరింతగా హోమ్ వర్క్ చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close