హ‌మ్మ‌య్య‌… నంది క‌దులుతోంది

తెలుగు చిత్ర‌సీమ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నంది అవార్డుల్ని గ‌త 5 యేళ్లుగా ప్ర‌క‌టించ‌డం లేదు. రాష్ట్రం విడిపోయిన త‌ర‌వాత నంది ప్ర‌స్తావ‌నే తీసుకురాలేదు. చిత్ర‌సీమ నుంచి ప్ర‌తినిధుల బృందం వెళ్లి ఆంధ్ర ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రినీ, సినిమాటోగ్ర‌ఫీ శాఖామంత్రినీ కలిసినా.. ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం నంది స్థానంలో సింహా అవార్డుల్ని అందించ‌డానికి అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇప్పుడు ఏపీ స‌ర్కార్ కూడా క‌ళ్లు తెరిచింది. నంది అవార్డుల కోసం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. 2012 నంది అవార్డుల క‌మిటీకి సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌ని అధ్య‌క్షురాలిగా నియ‌మించింది. 2013 నంది అవార్డుల క‌మిటీకి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యం వ‌హిస్తారు. వీళ్ల క‌మిటీ అతి త్వ‌ర‌లోనేనంది అవార్డుల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంది. రెండు సంవ‌త్స‌రాల అవార్డుల్నీ ఒకేసారి ప్ర‌దానం చేయాల‌ని ఏపీ స‌ర్కార్ భావిస్తోంది. ఉగాది రోజున నంది అవార్డుల ప్ర‌దానం ఉండొచ్చ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 2014, 15, 16 సంవ‌త్స‌రాల‌కు గానూ అవార్డు క‌మిటీ నియ‌మించ‌డానికీ, అవార్డుల్ని అందివ్వ‌డానికీ ఇంకా ఎంత కాలం ప‌డుతుందో..?? మ‌రోవైపు ఎన్టీఆర్ జాతీయ అవార్డుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. ఈ అవార్డుని ఈసారైనా పున‌రుద్ధ‌రిస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close