విమర్శలొచ్చినా ముందుకే..! మళ్లీ అమరావతి బాండ్ల అమ్మకం.. !!

నవ్యాంధ్ర నగర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలు కోవడం లేదు. ఎన్నికల సమయానికి అమరావతి పాలనా నగరానికి ఓ రూపు తీసుకు రావాలని.. చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నిధుల సమస్య ప్రధాన అడ్డంకిగా ఉంది. అటు కేంద్రమే కాదు.. ఇటు ప్రపంచబ్యాంక్ లాంటి సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా టాస్క్ పెట్టుకుని మరీ ప్రపంచ బ్యాంక్ కు ఏపీ నుంచి ఫిర్యాదులు వెళ్తున్నారు. ఫిర్యాదులపై విచారణకు ప్రపంచబ్యాంక్ బృందాలు వెళ్తున్నాయి.. వస్తున్నాయి. కానీ లోన్ విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కేంద్రం ఏ మాత్రం కనికరం చూపే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు బాండ్ల బాట ఎంచుకున్నారు. మార్కెట్లో ఇతర నగరాలు ప్రకటించనంత భారీ వడ్డీ ఆఫర్ చేసి.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో అమ్మకానికి పెట్టారు. తొలి విడతగా అనూహ్యమైన స్పందన వచ్చింది. రూ. 1300 కోట్ల సమీకరణ కోసం ప్రయత్నిస్తే.. ఏకంగా రూ. 2000కోట్లకు గంటలలోనే ఓవర్ సబ్‌ స్క్రైబ్ అయింది. దాంతో అమరావతిపై, తనపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఉందని… అంచనా వేసుకున్న చంద్రబాబు.. రెండో విడత బాండ్ల జారీకి సిద్ధమయ్యారు. 27వ తేదీన బీఎస్ఈలో మరోసారి బాండ్లను అమ్మకానికి పెడుతున్నారు.

అయితే ఈ బాండ్ల అమ్మకంపై…. విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రుణం తీసుకునే అవకాశం ఎక్కడా దొరకనందునే… చంద్రబాబు బాండ్లు అమ్ముతున్నారని… అధిక వడ్డీలు ఆఫర్ చేస్తూ.. ప్రజలపై భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి బాండ్లు నష్టదాయకమైనవని చెబుతూ… విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఈ విమర్శలు ఏ పని చేసినా చేస్తూనే ఉంటారని… తన పని తాను చేసుకుపోవాలని నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close