ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ టైం..!

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో.. ఏపీ సర్కార్ మళ్లీ లాక్ డౌన్ పై దృష్టి పెట్టింది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు.. నాలుగు వందలక కేసులుకుపైగా నమోదు కావడంతో.. కంగారుపడిన అధికార యంత్రాంగం… సడలింపులు తగ్గించడంపై దృష్టి పెట్టింది. ముందుగా అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. సడలింపులు కారణంగా.. ఒకరి నుంచి.. మరొకరికి… అలా.. పెద్ద ఎత్తున సోకుతూ పోతోంది. దీంతో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని గుర్తించారు.

అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గన్‌మెన్.. మరో ప్రజాప్రతినిధి బంధువు.. ఇలా పలువురు చనిపోయారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఇతరులకు సోకింది. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు.. ఒక్క కేసు కూడా ఉండేది కాదు. కానీ తర్వాత కేసులు బయటపడటం ప్రారంభమయ్యాయి. వలస కూలీల రాక తర్వాత… శరవేగంగా సెకండ్ స్టేజ్‌కి చేరుకుంది. దీంతో.. అక్కడా లాక్ డౌన్ విధించక తప్పలేదు. ప్రకాశం జిల్లాలోనూ సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని అంచనా వేసిన అధికారులు.. కీలక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇప్పకే భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కట్టడి జోన్లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకల్ని నియంత్రిస్తున్నారు.

ఏపీలో కొన్నాళ్ల కిందటి వరకూ.. కరోనా కంట్రోల్‌లోనే ఉండేది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో… దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. కానీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పెద్ద పెద్ద నగరాలు లేకపోయినా… మద్యం దుకాణాలు ప్రారంభించడంతో కరోనా కేసులు విజృంభించడం ప్రారంభించాయి. ప్రజాప్రతినిధులు సహా ప్రజలు కూడా కరోనా విషయాన్ని లైట్ తీసుకోవడంతో మళ్లీ ఆంధ్ర..లాక్ డౌన్ దిశగా వెళ్తున్నట్లుగా అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close