జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్రానికి ఏపీ ఇంటలిజెన్స్ లేఖ !

ఏపీ సీఎం జగన్ కు ఐసిస్, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆయనకు భద్రత కల్పించడం రాష్ట్ర పోలీసుల వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చారు. కేంద్రానికి లేఖ రాశారు. జగన్‌కూ జడ్ ప్లస్ సెక్యూరి్టీ కల్పించాలని అందులో కోరారు. ఏ ప్రాతిపదికన జగన్ కు .. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందో లేదో తెలియదు కానీ.. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల తీరు మాత్రం ఢిల్లీలో నవ్వుల పాలయింది.

కేంద్రానికి అత్యున్నత స్థాయి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఉంటుంది. దేశంలో ఎవరికి ముప్పు ఉంది.. దేశానికి ఎవరు ముప్పు అని వారు ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేస్తూనే ఉంటారు. రాష్ట్రాల ఇంటలిజెన్స్ లకు ఉండేది చాలా పరిమితమైన వనరులు. ఇంటలిజెన్స్ చేసేదంతా రాజకీయ నాయకులపైనే..ప్రత్యర్థులపైనే కాదు. సొంత పార్టీ నతేల ఫోన్లూ ట్యాప్ చేస్తూంటారు. సర్వేలు చేసుకోవడం.. ఇతరులపై నిఘా పెట్టడానికే పరిమితమవుతుంది. మరి సీఎంకు ఉగ్రవాదుల ముప్పు ఎక్కడ ఉందో ?

ఇటీవలి కాలంలో సీఎం భద్రత పేరుతో చేస్తున్న అతి తీవ్ర విమర్శల పాలవుతోంది. ఎక్కడిక్కకడ చెట్లు కొట్టేస్తున్నారు. డివైడర్లను తీసేస్తున్నారు. జగన్ వస్తున్నారంటే.. ఆ ఊరి ప్రజలు బాబోయ్ అనుకునే పరిస్థితి. ఇంత అతి చేస్తోంది.. ఆయనకు ముప్పు ఉందని చెప్పి జడ్ ప్లస్ సెక్యూరిటీకి సిఫారసు చేయడానికా అన్న సందేహాలు ఇతరుల్లో వస్తున్నాయి. జగన్ కు ఇప్పుడు ఉన్న భద్రత కారణంగా కిలోమీటర్ వరకూ ఆయన అనుకున్న వారు తప్ప ఇతరులు ఉండే అవకాశం లేదు. ఆయన ఇళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి 144 సెక్షన్ కిందనే ఉంటుంది.

ఏపీ ఇంటలిజెన్స్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు. సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ కల్పించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close