రాజధాని సాక్షిగా తెదేపా, వైకాపాల యుద్ధం

ఏపి రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు గానీ అది తెదేపా, వైకాపాలకు రణభూమిగా ఉపయోగపడుతోంది. తెదేపాకి చెందినా మంత్రులు, నేతలు, ప్రజా ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూమిని తమ బినామీ పేర్లతో కొనుగోళ్ళు చేసారని ఆరోపిస్తూ ఆ వివరాలతో సహా వైకాపా మనసాక్షి వంటి సాక్షి మీడియాలో వరుస కధనాలు రావడంతో తెదేపా, వైకాపా నేతల మధ్య యుద్ధం మొదలయింది.

తెదేపా నేతలు సాక్షిలో వచ్చిన కధనాలని ఖండిస్తూనే ఉన్నారు. కానీ సాక్షిలో ఇంకా మంత్రులకి వ్యతిరేకంగా కధనాలు వస్తూనే ఉన్నాయి. వాటిని తెదేపా నేతలు ఇంకా గట్టిగా ఖండిస్తూనే ఉన్నారు…వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధం వలన తెదేపా, ప్రభుత్వ ప్రతిష్టలు చాలా దెబ్బతింటున్నాయి. రావెల కిషోర్, పయ్యావుల కేశవ్, వేమూరి రవికుమార్ తదితరులు రాజధానిలో భూములు కొన్నట్లు తెదేపా నేతలే స్వయంగా చెప్పుకోవడంతో సాక్షి, వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు కూడా అనుమానించే పరిస్థితి కల్పించుకొన్నారు.

ఈ వ్యవహారంపై ఇంతవరకు ఆత్మరక్షణకే పరిమితమయిన తెదేపా నేతలు ఇప్పుడు వైకాపాపై యుద్ధానికి సిద్దం అయినట్లున్నారు. తమ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా సాక్షి మీడియాలో అసత్య, ఆధారరహితమయిన కధనాలు ప్రచురించినందుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ సాక్షి మీడియాకి నిన్న లీగల్ నోటీసులు పంపించారు. తమపై నిరాధారమయిన ఆరోపణలు చేసినందుకు ఆ పత్రిక బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే కోర్టులో పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్దం కావాలని నోటీసులలో పేర్కొన్నారు. దీనిపై సాక్షి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

అది తన వద్ద బలమయిన ఆధారాలున్నట్లు ప్రకటించింది కనుక న్యాయస్థానానికి వెళ్లేందుకే మ్రోగ్గు చూపవచ్చును. ఒకవేళ ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో ఓడిపోయినా, దానిపై సుప్రీం కోర్టు వరకు వెళ్లి సాగదీసే వీలుంటుంది. కానీ దీని గురించి ‘రాజధాని భూముల కుంభకోణం కేసు’ అనే హెడ్డింగ్ తో రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాలో వచ్చే వార్తలలో ఏపి మంత్రుల పేర్లు కూడా కనబడుతుంటే దాని వలన తెదేపాకి, తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా చాలా అప్రదిష్ట కలగవచ్చును. పైగా ఆంధ్రాలో మీడియా అణచివేతకు గురవుతోందనే ప్రచారం అవుతుంది. కనుక ఈ వ్యవహారంలో మంత్రులతో న్యాయ పోరాటానికే సాక్షి సిద్దపడవచ్చును.

ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ గుంటూరు సమీపంలోగల ‘హాయ్ ల్యాండ్’ ని చేజిక్కించుకొని అవినీతికి పాల్పడ్డారని సాక్షి మీడియా ఆరోపించింది. కానీ ఆయన ఈ కారణంగానే సాక్షికి లీగల్ నోటీసులు పంపకపోవచ్చును. ఒకవేళ పంపినట్లయితే కోర్టులో ఈ కేసు సాగుతున్నంత కాలం మీడియాలో “ముఖ్యమంత్రి కొడుకు హాయ్ ల్యాండ్ కేసు” అనే హెడ్డింగుతో వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భవిష్య పరిణామాల గురించి ఆలోచిస్తే తెదేపా, వైకాపాలలో ఏది తప్పటడుగు వేసింది?అనే సందేహం కలగడం సహజం. దానికి కాలమే జవాబు చెపుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close