ఎస్‌ఈసీపై తిట్లవర్షం..! అసహనమా..? రెచ్చగొట్టే వ్యూహమా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న దాడి .. చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎన్నికలు నిర్వహించడమే మహాపాపమన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ఆయనేదో అంటరానిఅధికారి అన్నట్లుగా ఒక్కొక్కరు మీడియా ముందు ప్రతిపక్ష రాజకీయ నేతల్ని తిట్టినట్లుగా తిడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఆయన డీఎన్‌ఏల గురించి… శరీర రంగు గురించి.. మాట్లాడేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎంతో మంది కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ విధులు నిర్వహించి ఉంటారు కానీ.. ఎవరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండరు.

ఎన్నికల కమిషన్‌పై సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూంటాయి. ఒక వేళ తాము ఏమీ విమర్శించకపోతే.. వారు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తారన్న భావనతోనే అయినా విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శలు హద్దుల్లోనే ఉంటాయి. తప్పులు మాత్రమే ఎత్తి చూపేవారు . కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరుగా ఉంది. ఎస్‌ఈసీ ఏం తప్పు చేస్తున్నారో చెప్పడం లేదు కానీ అధికార పార్టీ ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. తిట్టినతిట్టు తిట్టకుండా తిడితే.. ఆయన మానసికంగా బలహీనపడిపోయి.. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్నట్లుగా వైసీపీ నేతల ప్రవర్తన ఉంది. ప్రతిపక్ష నేతలపై ఇప్పటికే ఇలాంటి వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తోంది. ఇప్పుడు… ఎస్‌ఈసీపైనా ప్రయోగిస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ను అంత దారుణంగా తిట్టాల్సిన విమర్శించాల్సిన సందర్భం ఏమిటో వైసీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధమైతే.. అదే విషయాన్ని ప్రస్తావించవచ్చు. కానీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటనకు వెళ్లినా విమర్శిస్తున్నారు. అధికారులతో సమీక్షలు పెట్టినా విమర్శిస్తున్నారు. తన విధులు తాను నిర్వహించినా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకన్నది చాలా మంది వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ధైర్యంగాఎన్నికలను ఎదుర్కొని ప్రజల్లోనే సత్తా చూపుదామని మెజార్టీవైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ.. వైసీపీ హైకమాండ్ మాత్రం నిమ్మగడ్డను ఏదో విధంగా విమర్శించాలనే పనిలోనే ఉంది. ఆయనను రెచ్చగొట్టి ఏదో ఓ తప్పు చేస్తే దాన్ని హైలెట్ చేయాలన్న వ్యూహం కూడా ఇందులో ఉండి ఉండవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారన్నఅభిప్రాయం అన్ని వర్గాల్లో ఏర్పడుతోంది. సుప్రీంకోర్టు కూడా అహన్ని తగ్గించుకోవాలని సూచించింది. కానీ ఏపీ సర్కార్ పెద్దలు అదేమీ పట్టించుకోవడం లేదు. చెలరేగిపోతున్నారు. ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేనంత మాత్రాన.. ఎస్‌ఈసీపై ఇలా చెలరేగిపోవడం ప్రజాస్వామ్య లక్షణం కాదన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను తిట్టే తిట్లలా నిమ్మగడ్డను తిడుతున్నారు. ఆయన తన పని తాను చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం తటస్థుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close