ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న .. తెలంగాణకు రమణే..!

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ జాతీయ కమిటీల్ని పునర్‌వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 మందితో టీడీపీ కేంద్ర కమిటీ.. ఇరవై మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులు కల్పించారు. పొలిట్ బ్యూరో పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల , వర్ల రామయ్య సహా.. మరో నలుగురికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణ రాజీనామా చేసిన గల్లా జయదేవ్‌కు చోటు కల్పించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, ఫరూక్‌, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ,గుమ్మడి సంధ్యారాణిలకు చోటు కల్పించారు. అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు మరో వైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణ వద్దంటూ.. కొంత మంది నేతలు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 31 మందితో తెలంగాణ టీడీపీ కమిటీని ఏర్పాటు చేశారు.

అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించడంలో కాస్త ఆలస్యం జరగడంతో.. ఇతర టీడీపీ నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ జాతీయ కమిటీల కూర్పు కోసమే అగినట్లుగా టీడీపీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు అచ్చెన్నను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close