ఒక్క హైకోర్టేనా..? ఉమ్మడి సంస్థల వివాదాలూ ఎందుకు పరిష్కరించరు..?

ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఇప్పుడు.. అటు కేంద్రంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా కీలకంగా మారింది. విభజన చట్టంలో అదొక్కటే పరిష్కారం కాని వివాదం అన్నట్లు..లీకుల మీద లీకులు ఇస్తున్నారు. ఓ సారి ఏపీలో జనవరి నుంచే హైకోర్టు కార్యకాలాపాలు ప్రారంభమవుతాయని లీకిచ్చారు. మరోసారి హైదరాబాద్ లోనే కొన్నాళ్ల ఏపీ హైకోర్టు పని చేస్తుందన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న హైకోర్టు విభజన పిటిషన్ పై కూడా.. తెలంగాణ ప్రభుత్వ ఇదే మాదిరిగా స్పందించింది. ప్రసుత్తం ఉన్న హైకోర్టు భవనాన్నే విభజించి..రెండు హైకోర్టులు ఏర్పాటు చేయవచ్చన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ప్రస్తుతమున్న హైకోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు..అభ్యంతరం లేదన్న తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఉమ్మడి హైకోర్టును ప్రతివాదిగా చేర్చింది. గతంలో హైకోర్టు విభజనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని స్పష్టం చేసింది.

హైకోర్టు భవనాలను ఏపీకి ఇచ్చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా ఔదార్యం చూపిస్తోంది. కానీ.. పరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారానికి మాత్రం.. ఒక్క ఇంచ్ కూడా ముందుకు రావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్య వస్థీకరణ చట్టంలోని 9 వ షెడ్యూల్‌ పేర్కొన్న సంస్థల విభజన ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా.. పరిష్కారానికి చూపిన చొరవ అంతంతమాత్రమే. రాజ్‌భవన్‌ వేదికగా రెండు రాష్ట్రాల మంత్రులు గవర్నర్‌ సమక్షంలో పలుమార్లు భేటీ అయ్యారు. కీలకమైన 9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం కుదిరిందని కూడా అప్పట్లో ప్రకటించారు. సమావేశం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే కాకుండా విజయవాడలోనో, అమరావతిలోనే జరపాలని కూడా అనుకున్నారు. అయితే ఈ నిర్ణయం మాటలకే పరిమితం అయ్యింది.

ఏపీలో ఉన్న పారిశ్రామిక, వాణిజ్యపరమైన ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులను.. విభజన తేదీ నాటికి ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ ప్రాంతంలో ఉన్నదనే దాన్నిబట్టి కాకుండా ఆ సంస్థ కార్యకలాపాలు ఏయే ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయనే దాన్ని బట్టి విభజించాలని సెక్షన 53లో పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి కేసులో భౌగోళికంగా ఆయా సంస్థలు తమ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ మావే అని తెలంగాణ చేసిన వాదన సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం మాత్రం.. ఆ తీర్పును సైతం పక్కన పెట్టి హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థలన్నీ.. తెలంగాణకే చెందుతాయన్నట్లుగా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో వివాదం మరింత పీట ముడి పడింది. వీటన్నింటినీ పరిష్కరించుకుండా.. ముందుగా హైకోర్టును విభభచించాల్సిందేన్నట్లుగా.. అటు కేంద్రం.. ఇటు తెలంగాణ తొందర పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close