రాని యాత్రీకులు – ఏర్పాట్ల చికాకులు

గోదావరి అంత్య పుష్కరాలకు వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకి లక్షన్నర వుంటుదన్న అంచనాతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. యాత్రీకుల కంటే బందోబస్తుకి వచ్చిన పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగుల సంఖ్యే బాగా కనిపిస్తోంది.

హిందువుల విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం తరతరాలుగా ప్రచారాలకు అతీతంగా జరిగిపోయే పుష్కరాల్లో యాత్రికులకు వసతి సౌకర్యాలు, పారిశుధ్య ఏర్పాట్లు కు మాత్రమే మొదట్లో ప్రభుత్వాలు పరిమితమయ్యాయి. ప్రజల ఆదరాభిమానాలకోసం రానురానూ సన్నాహాల్లో ప్రభుత్వ జోక్యాలు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడైతే పుష్కరాలను ఫెస్టివ్ ఈవెంటుగా మార్చేశారు. పుష్కరాలతో ముడిపడి న వేర్వేరు సర్వీసుల్లో, వ్యాపారాల్లో వున్న వేలాదిమందికి లక్షల రూపాయల ఆదాయాలు సమకూర్చే ఎకనమిక్ స్టిమ్యులేటర్ లా ఈ ఈవెంటును మార్చేశామని గోదావరి ఆది పుష్కరాల్లో స్వయంగా చంద్రబాబే వివరించారు.

అయితే రాష్ట్రప్రభుత్వం ఆశించినట్టు ఆది పుష్కరాలకు కేంద్రప్రభుత్వం ఒక్కరూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. అలాగే ఇపుడు అంత్య పుష్కరాలకు రాష్ట్రప్రభుత్వం కూడా ఒక్కరూపాయైనా విడుదల చేయలేదు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నిధులను, జిల్లా కలెక్టర్ మంజూరు చేసే నిధులను ఇందుకు ఖర్చుచేస్తారు.

ఆది పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయిన సంఘటనను దృష్టిలో వుంచుకుని రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలు అతి జాగ్రత్తలు తీసుకున్నాయి. జనం లేని గోదావరి గట్టు రోడ్డుని బారికేడ్లలో బంధించేశారు. వాహనాల రాకపోకలను ఆపేసి ప్రజల్ని కిలోమీటర్లకొద్దీ నడిపిస్తూ ఆయాసపెడుతున్నారు.

పురాణాల ప్రకారం…బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి ఏడాదికి ఒకొక్క నదిలో పన్నెండేసి రోజుల పాటు వుండాలని ఆదేశించాడు. అరోజులే ఆయానదుల పుష్కరాలు. గౌతమిలో మాత్రం పన్నెండురోజులకి అదనంగా రోజూ మధ్యాహ్నం రెండు ఘడియలు, తిరిగి చివరి పన్నెండురోజులూ పూర్తిగానూ వుండాలని ఆదేశించాడు. ఇందువల్లే మరేనదికీ లేని విధంగా చివరి పన్నెండు రోజులూ గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలయ్యాయి.

ఆది పుష్కరాల్లో పిండప్రధానాలు చేయడానికి రకరకాల మైలల వల్లా, ఇతర కారణాలవల్లా అవకాశం లేనివారు అంత్య పుష్కరాల్లో తీర్ధవిధులు నిర్వహిస్తారు. దక్షిణ కాశిగా నమ్మే రాజమహేంద్రవరంలో యాత్రికులు, తీర్ధవిధులు నిర్వహించేవారు, పుణ్యస్నానాలు చేసేవారు, నదే ఆధారంగా జీవించే వృత్తులవారు రోజూ 5 వేల మంది వేర్వేరు రేవుల్లో స్నానాలు చేస్తూ కనబడుతారు. పండగరోజుల్లో ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుంది. అంత్య పుష్కరాల్లో ఐదింతలు వుంటుంది. అయినా కూడా ఇపుడున్న యాత్రీకుల సంఖ్య కార్తీకమాసంలో, మహాశివరాత్రి నాడు గోదావరి స్నానాలు చేసేవారి కంటే తక్కువే!

2003 లో జరిగిన గోదావరి అంత్య పుష్కరాలకు పెద్ద ప్రచారం వచ్చింది. మంత్రి జక్కంపూడి రామమోహనరావు చొరవతో అపుడు అంత్య పుష్కరాల సమయంలోనే గోదావరి ఉత్సవం కూడా నిర్వహించారు. అలా అంత్యపుష్కరాలకు హైప్ వచ్చింది.అప్పటిలాగే గోదావరి ఉత్సవాలను కూడా కలిపి నిర్వహించడానికి రెండుకోట్ల రూపాయలు ఖర్చకాగల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. నిధుల కొరత వల్ల గోదావరి ఉత్సవాలను వాయిదావేసుకోవాలని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి సూచించారు.

అయినాగాని మితిమీరిన అతి బందోబస్తుతో అధికారులు పోలీసులు యాత్రికుల ప్రయాసల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. స్ధానికుల్ని విసిగిస్తున్నారు.

మరోవైపు గోదావరి అంత్యపుష్కరాల సన్నాహాలు ఏర్పాట్ల ”ఘనంగా” ఉన్నాయన్న వార్తలతో ఒక పెద్ద దినపత్రిక, ”పూర్తిగా విఫలం” అన్నవార్తలతో మరొక పెద్ద దినపత్రిక ప్రజల్ని గందరగోళంలోకీ తోసేస్తున్నాయి. అయోమయంలో ముంచేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close