రాష్ట్రపతికి ఫిర్యాదు కంటే ముందే అరెస్టులు !

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని .. పోలీసు వ్యవస్ధ విఫలం అయిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని చేస్తూ సోమవారం చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. అయితే ఈ దాడుల విషయంలో ” అభిమానస్తుల బీపీ పెరిగిన వారి” చర్యగా భావించి సమర్థిస్తూ వచ్చిన పోలీసులు హఠాత్తుగా అరెస్టులు చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. శనివారం పది మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. మళ్లీ ఆదివారం మరో ఆరుగుర్ని అరెస్ట్ చేసిటన్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు.

నిజానికి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితులు హత్యాయత్నానికి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ట్రెస్ పాసింగ్ కేసులుమాత్రమే పెట్టారు. ఈ అంశంపైనా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించలేదు. సీసీ టీవీ ఫుటేజీ కావాలంటూ కార్యాలయం గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఇదంతా పోలీసులు ఆడుతున్న నాటకమని.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే నిందితుల్ని అరెస్ట్ చేశామని. కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు, పోలీసులు పెట్టిన తప్పుడు కేసులతో సహా మొత్తం కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుటికే టీడీపీ లీగల్ సెల్ కసరత్తు పూర్తి చేసిందని.. దాడిలో పాల్గొన్న వారిలో పది మంది పోలీసుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో ముందు ముందు ఈ అంశం కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close