మళ్లీ ఇద్దరు నిర్మాతల్ని కలిపిన మహేష్!

‘మహర్షి’ కోసం దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌ను కలిపాడు మహేష్ బాబు. ఒక్క సినిమాతో ఇద్దరు నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తరవాత మహేష్ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ నిర్మించిన పివిపి ఈ సినిమాలో భాగస్వామి అయ్యారు. అదో పెద్rద కథ! ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతల్ని కలిపినట్టు సందీప్ రెడ్డి వంగా సినిమాకూ ఇద్దరు నిర్మాతల్ని ఒక్కటి చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ చేస్తున్నాడు. దీని తరవాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఆ తరవాత ‘అర్జున్ రెడ్డి’తో ఆకట్టుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దానికి మొత్తం ముగ్గురు నిర్మాతలు. ఏషియన్ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ ఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమా ను ఏషియన్ సంస్థ విడుదల చేసింది. దాంతో ఆ సంస్థకు ఓ సినిమా చేస్తానని సందీప్ రెడ్డి కమిట్ అయ్యాడు. అతన్ని మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళింది ఏషియన్ సునీల్ నారంగ్. ఇటీవల మహేష్ ప్రారంభించిన మల్టీప్లెక్స్ లో అతను భాగస్వామి కూడా. ఏషియన్ లో మహేష్ ఓ సినిమా చేయాలట. అలాగే మైత్రిలో కమిట్మెంట్ ఉంది. దాంతో సందీప్ రెడ్డి వంగ సినిమాకు ఏషియన్ సునీల్, మైత్రి అధినేతలను నిర్మాతలను చేశాడు. సుకుమార్ సినిమానూ కూడా మైత్రిలోనే చేస్తున్నాడు మహేష్. సుకుమార్, సందీప్ సినిమాలతో మైత్రిలో మహేష్ మూడు సినిమాల అగ్రిమెంట్ పూర్తవుతుంది. మహేష్ సరే అనాలి గానీ అతడితో ఎన్ని సినిమాలైనా చేయడానికి మైత్రి నిర్మాతలు సిద్ధమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close