పవన్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారని కానిస్టేబుళ్లపై వేటు..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వేకెన్సీ రిజర్వ్‌కు పంపేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కానిస్టేబుళ్లు అయితే మాత్రం వారికి వ్యక్తిగత ఇష్టాలు ఉండకూడదా అన్న అనుమానం ప్రారంభమయింది. పవన్ కల్యాణ్‌ను అభిమానిస్తే.. ఆయనపుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటే పోలీసు శాఖకు వచ్చిన చెడ్డపేరు ఏమిటన్న అనుమానం అందరికీ వస్తోంది. అదే సమయంలో పోలీసులు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కార్యక్రమాల్లో పాల్గొంటే అవార్డులు.. రివార్డులు ఇస్తున్న విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు.

పోలీసులు అంటే అధికార పార్టీకీ మాత్రమే అభిమానం చూపాలని.. సినిమాల పరంగా అభిమానం ఉన్నా కూడా చూపకూడదన్నట్లుగా ఉన్నతాధికారుల తీరు ఉందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పోలీసుల తీరు సామాన్యులను రోజూ ఆశ్చర్య పరుస్తూంటే ఆ డిపార్టుమెంట్‌లోనూ వారి పక్షపాత చర్యలు సొంత వారిని కూడా వదిలి పెట్టకుండా వేధింపులకు పాల్పడుతున్నారని తాజా పరిణామాలతో తేలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రధాన పోస్టులన్నీ ఓ వర్గానికే దక్కుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా డీఎస్పీ, సీఐ లాంటి పోస్టుల పేర్లను చూస్తే ఎవరెవరికి అందలం దక్కిందో అర్థమైపోతుందని… చాలా మందికి కనీసం పోస్టింగులు లేవని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల నడుమ దిగువ స్థాయిలో పని చేసే కానిస్టేబళ్లను కూడా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారన్న కారణంగా చర్యలు తీసుకోవడం పోలీసు డిపార్టుమెంట్‌పై ప్రజల్లో మరో రకమైన అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపించేందుకు కారణం అవుతోంది. సాక్షాత్తూ ఉన్నతాధికారులే రాజకీయ కామెంట్లు చేస్తున్న సమయంలో ఈ కానిస్టేబుళ్లకు మాత్రమే ఎందుకు నిబంధనలు వర్తింప చేశారో పోలీసు శాఖ బహిరంగ ప్రకటన చేస్తే ప్రజలు నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close