న్యూజెర్సీలో జీవీఎల్‌కు చేదు అనుభవం..!

తెలుగు బీజేపీ నేతలకు ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకహోదా సెగ వదలడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన తెలుగు వ్యక్తి జీవీఎల్ నరసింహావు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి తెలుగు సంఘాలతో సమావేశమవుతున్నారు. న్యూజెర్సీలో ఇలా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎల్ నరసింహారావును తెలుగు ప్రజలు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన మోసంపై నిదీశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి కారణాలేమిటని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో జీవీఎల్‌కు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయారు.

న్యూజెర్సీలో బీజేపీ సానుభూతి పరులే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక విజయంతో.. సంబరాలు జరుగుతాయనుకున్న జీవీఎల్‌కు ఎక్కువగా నిరసనలే ఎదురయ్యాయి. జీవీఎల్ తన ప్రసంగంలో ఎక్కువగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమేం ఇచ్చిందో ఏకరవు పెట్టే ప్రయత్నం చేశారు. లక్షల కోట్లు ఇచ్చిందని లెక్కలు చెప్పడం ప్రారంభించారు. దీంతో అవి వింటున్న తెలుగువారిలో అసహనం పెరిగిపోయింది. రాజ్యాంగ పరంగా పన్నుల్లో వాటాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు కాకుండా.. మిగతావి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నీ అబద్దాలే చెబుతున్నారని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో జీవీఎల్ ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ సమావేశానికి జీవీఎల్‌తో పాటు రామ్‌మాధవ్ కూడా హాజరవ్వాల్సి ఉంది. కానీ కర్ణాటక రాజకీయ పరిణామాలు, తల్లి మరణంతో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. ఎంపీగా ఎన్నికైన తర్వాత జీవీఎల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబుపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఏపీకి మోదీ ఎంతో చేశారని… చెప్పుకొస్తున్నారు. దక్షిణాదిపై దండయాత్ర చేస్తామని బెదిరిస్తున్న తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీకి కొద్ది అనుకూలంగా వస్తున్న సమయంలో… ఏపీలో అదరహో అనిపిస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో జీవీఎల్‌కు అలాంటి పరిస్థితే ఎదురైందని సైటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close