కనుసైగ చేస్తే ఏమయ్యేది..? వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్..!

హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. ఎప్పుడు హిందూపురం వెళ్లినా.. కార్యక్రమాల్లో పాల్గొని… ఎలాంటి రాజకీయ స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా వచ్చే బాలకృష్ణ.. ఈ సారి మాత్రం.. రూటు మార్చారు. భారీ ర్యాలీతో హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్తత ఏర్పడటంతో.. పోలీసులు వారిని అక్కడ్నుంచి తరలించారు. ఈ ఘటనపై.. హిందూపూర్‌లో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన బాలకృష్ణ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన కాన్వాయ్‌కి అడ్డుపడ్డ వైసీపీ కార్యకర్తల విషయంలో… తాను కను సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేదని ప్రశ్నించారు.

మౌనం చేతగాని తనం అనుకోవద్దు.. చట్టంపై మాకు గౌరవం ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమని.. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకే చోట ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన సాగుతోందన్నారు. నాడు తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. నేడు తనయుడు రద్దు చేస్తున్నాడని.. తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి నీరుగారుస్తున్నాడని జగన్ పై మండిపడ్డారు. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ… ఇప్పుడు కానీ.. బాలకృష్ణ… పొలిటికల్ కామెంట్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. ఆయన సమయం కేటాయిస్తూంటారు.

అయితే.. బాలకృష్ణ.. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో పర్యటిస్తూంటే.. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ అలాగే జరిగింది. పోలీసులు రక్షణ ఏర్పాట్లు కల్పించకపోవడంతో.. టీడీపీ నేతలే.. రక్షణ ఏర్పడి .. భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు .. వైసీపీ కార్యకర్తలు నేరుగా బాలకృష్ణ కాన్వాయ్ మీదకొచ్చేశారు. దీంతో ఆయన రాజకీయ పరంగా ఎదురుదాడి ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close