రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో బండారు దత్తాత్రేయకి క్లీన్ చిట్!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు కారణాలను, బాధ్యులను కనుగొనేందుకు కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ తన నివేదికను సమర్పించింది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రానికి వ్రాసిన లేఖకు ఎటువంటి సంబందమూ లేదని తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి సూరత్ సింగ్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ షకీలా షంసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో, అద్యాపకులతో మాట్లాడిన తరువాత యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్ధుల సమస్యను పరిష్కరించడంలో అశ్రద్ద చూపినందునే చివరికి అది రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిందని తమ నివేదికలో తేల్చి చెప్పారు.

రోహిత్ తో సహా మరో నలుగురు విద్యార్ధులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేసిన యూనివర్సిటీ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సబ్ కమిటీ నిర్ణయాన్ని కూడా ద్విసభ్య కమిటీ తప్పు పట్టింది. కొందరు విద్యార్ధుల పట్ల అద్యాపకులు, యూనివర్సిటీ యాజమాన్యం వివక్ష చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. విద్యార్ధుల పట్ల వివక్ష, విద్యార్ధుల ఆత్మహత్యలపై విచారణ జరపడానికి గతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కమిటీల సూచనలను, సలహాలను యూనివర్సిటీ పట్టించుకాలేదని నివేదికలో పేర్కొన్నారు.కనుక యూనివర్సిటీ ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి నిర్దిష్టమయిన మార్గదర్శకాలు తక్షణమే ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించారు.

ద్విసభ్య కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ఊహించినట్లే ఉన్నాయి. ఈ కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు యూనివర్సిటీకి వ్రాసిన లేఖల కారణంగానే ఆ విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్లు ఆందోళన చేస్తున్న విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కానీ కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకే చెందిన ఉద్యోగులతో ఈ ద్విసభ్య కమిటీని అదే శాఖ మంత్రి నియమించారు కనుక నివేదికలో కేంద్రమంత్రులు ఇద్దరినీ ఎక్కడా తప్పు పట్టలేదు. ఇక ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం అయ్యిందో, దానికి పరిష్కార మార్గాలు ఏమిటో యూనివర్సిటీ యాజమాన్యానికి, విద్యార్ధులకి, కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకి కూడా తెలుసు. కనుక ద్విసభ్య కమిటీ తన నివేదికలో కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు. అయినా కమిటీ ఎందుకు వేశారు అంటే ప్రతిపక్షాలను, విద్యార్ధులను చల్లబరచడానికి, కేంద్రమంత్రి బండారు దత్తత్రేయకి క్లీన్ చిట్ ఇవ్వడానికేనని చెప్పవచ్చును.

రోహిత్ మరణించిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నేతలు యూనివర్సిటీ మీద కాకుల్లాగ వాలిపోయి హడావుడి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వారిలో ఎవరూ యూనివర్సిటీవైపు తొంగి చూడలేదు. ఆ తరువాత కమిటీని ఏర్పాటు చేయడం అది ఊహించినట్లే మంత్రిగారికి క్లీన్ చిట్ ఇచ్చేసి తన పని పూర్తయిపోయిందని చేతులు దులుపుకొంది. కానీ నేటికీ యూనివర్సిటీలో సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇదంతా కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లుంది తప్ప వేరే ప్రయోజనం కబడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close