డ్రగ్స్ కేసుల పేరుతో బెదిరిస్తున్న బండి సంజయ్ !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కౌంటర్‌గా డ్రగ్స్ కేసును తెరిపిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి కాలంలో రోజూ బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆయన బెంగళూరు డ్రగ్స్ కేసుపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏడాదిన్నర కిందట బెంగళూరులో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, సినీ తారల పేర్లు ముఖ్యంగా తెలంగాణ వారివి ప్రచారంలోకి వచ్చాయి. ఇక నోటీసులు ఇచ్చి వారిని అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకెళ్లమే మిగిలిందని అనుకున్నారు. కానీ తర్వాత కేసు చల్లబడిపోయింది.

ఈ కేసు అంశాన్ని ఇప్పుడు బండి సంజయ్ తెరపైకి తెస్తున్నారు. కర్ణాటకలో ఉంది తమ ప్రభుత్వమేనని .. ఆ కేసును బయటకు తెప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని జైలుకు పంపిస్తామని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ అన్న ప్రచారం ఉంది. అందుకే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఆ కేసు అప్పట్లోనే తేలిపోయింది. అయితే పోలీసులు… ఎమ్మెల్యేలు.. ఇతరులకు డబ్బులిచ్చి మేనేజ్ చేశారని.. కానీ తాము వదిలి పెట్టబోమని బండి సంజయ్ అంటున్నారు.

తాజాగా ఆయన డ్రగ్స్ ఆరోపణల్ని కేటీఆర్ మీదకూ మళ్లించారు. కేటీఆర్ డ్రగ్స్ కు బానిసని.. కావాలంటే టెస్టులకు రావాలని సవాల్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ పేరుతో హడావుడి చేశారు. కేటీఆర్‌కు సవాల్ చేశారు. టెస్టులకు రావాలని ఒత్తిడి చేశారు. అయితే కేటీఆర్ తనపై ఆరోపణలు చేయకుండా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్‌ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి. .. బండి సంజయ్ స్వీకరించారు. ఇప్పుడు అలాంటి టెస్టుల సవాలే.. కేటీఆర్‌కు మళ్లీ బండి సంజయ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close