హైకోర్టు ముక్కతో రాయలసీమకు ఒరిగేదేంటి..?

కర్నూలు జిల్లా వాసులు ఎప్పటి నుండో హైకోర్టును కోరుతున్నారు. రాష్ట్ర విభజన తరవాత గతంలో త్యాగం చేసిన రాజధాని.. మళ్లీ వస్తుందేమో అని ఎదురు చూశారు. కానీ..అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో.. అమరావతిని గత ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త ప్రభుత్వం అమరావతిని మార్చాలనుకుంది. కానీ.. రాజధానిని మాత్రం కర్నూలుకు ఇవ్వలేదు. హైకోర్టును మాత్రం ప్రకటించిది. అదే సమయంలో.. హైకోర్టు బెంచ్‌లను.. అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. హైకోర్టులో ఓ భాగమే. దాని వల్ల.. పెద్దగా ఉపయోగపడేది ఏమీ ఉండదని…రాయలసీమ నేతలు పెదవి విరుస్తున్నారు.

గ్రేటర్ రాయలసీమకు రాజధాని ఇవ్వాలని లేకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని కొంత మంది రాయలసీమ నేతలు.. పోరాటం ప్రారంభించారు. రాయలసీమను దశాబ్దాలుగా.. నేతలు ఆన్యాయం చేస్తున్నారనేది వారి వాదన. తమిళనాడుతో విడిపోయిన సమయంలో.. కర్నూలును రాజధానిగా ప్రకటించారని.. కానీ..కలసి ఉండాలన్న ఉద్దేశంతో త్యాగం చేశామని.. అప్పుడు అమలు చేస్తామన్న హామీలను పాలకులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్న అసంతృప్తి రాయలసీమలో ఉంది. పలు సందర్భాల్లో… ఈ అసంతృప్తి బయటపడింది. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానులను మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత.. రాయలసీమ గురించి పట్టించుకోకుండా.. అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ప్రకటించారని.. అది కూడా.. రాయలసీమకు సుదూరంగా నిర్ణయించడం.. అక్కడి ప్రజల్లో నేతల్లో అసహనానికి కారణం అవుతోంది.

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను తరలించడం వల్ల.. రాయలసీమకు మరింత నష్టం జరుగుతుందంటున్నారు. అందుకే రాజధాని ఇస్తే ఇవ్వండి..లేకపోతే.. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని మార్పుపై రాయలసీమలో వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోంది. కర్నూలులో హైకోర్టు పెడితే లాభం ఏముందన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది.రాజధాని విశాఖకు తరలిపోతే సీమ ఘోరంగా నష్టపోతుంన్న అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయం తర్వాత అక్కడా నిరసనలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close