బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మృతి..!

కడప జిల్లా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం . గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన 44వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వృత్తి రీత్యా వైద్యుడైన వెంకట సుబ్బయ్య… వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో బద్వేలు నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ అనుకోవడంతో.. ఆయనకు అవకాశం దక్కింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

బద్వేలు నుంచి గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా జయరాములు ఉన్నారు. ఆయన ఓ సారి టీడీపీలో చేరారు.తర్వాత బీజేపీలో చేరారు. రిజర్వుడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బద్వేలులు వైసీపీకి చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలే పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేకు తక్కువ పని ఉంటుంది. ఆత్మాభిమానం లేదని.. ఎమ్మెల్యే అయినా తన మాట ఎవరూ పట్టించుకోవడం లేదని జయరాములు ఆవేదనతో ఉండేవారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించి.. వెంకటసుబ్బయ్యకు వైసీపీ చాన్సిచ్చింది. అయితే ఆయన.. రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. ఎక్కువగా వైసీపీ ఇతర నేతలే పనులు చక్క బెట్టేవారు.

ప్రజాప్రతినిధులందరూ.. చిన్న పాటి అనారోగ్యం వచ్చినా హైదరాబాద్, చెన్నైలలో వైద్య సౌకర్యం పొందుతారు. కానీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మాత్రం కడపలోనే చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం గురించి సమాచారం ఉన్న.. పార్టీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదన్న ఆవేదన …. వెంకట సుబ్బయ్య అనుచరుల్లో ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు అనారోగ్యంతో చనిపోయారు. తిరుపతికి ఉపఎన్నిక జరుగుతోంది. ఆరు నెలల్లో బద్వేల్ కు కూడా ఉపఎన్నిక జరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close