ఇప్పుడు బీజేపీ వంతు – తమిళిసై ప్రసంగంపై విమర్శలు !

తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. నిన్నటి వరకూ గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు తప్పు పట్టారు. ఇవాళ మాత్రం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో గవర్నర్ చెప్పినవన్నీ అబద్దాలేనని మండి పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినవి చదివారని అందులో ఒక్క నిజం లేదని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. అయితే గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.

అనేక మలుపులు తిరిగిన వివాదం తర్వాత గవర్నర్ తమిళి సై .. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని యథాతథంగా చదివారు. అందులో తెలంగాణ సర్కార్ చెప్పుకుటున్న విజయాలన్నీ ఉన్నాయి. గతంలో వీటిని తమళిసై విమర్శించి ఉన్నారు. అయినా వాటిని చదవక తప్పలేదు. మామూలుగా గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ వద్దనుకుంది. కానీ కోర్టులో జరిగిన పరిణామాలతో గవర్నర్ ప్రసంగాన్ని అంగీకరించక తప్పలేదు. అప్పట్నుంచి రెండు, మూడు సార్లు అభిప్రాయాలు తెలుసుకుని మరీ ప్రసంగాన్ని ఆమోదించారు. దీంతో గవర్నర్ కూడా వివాదాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఇచ్చింది చదివారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోయింది. చాలా కాలంగా ప్రభుత్వం గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రానివ్వలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. ప్రసంగం పూర్తైన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట నడిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close