టిఆర్ఎస్ పై బిజెపి ముప్పేట దాడి మొదలెట్టిందా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పూర్తిగా బలపడాలని, వీలైతే అధికారంలోకి కూడా రావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్న బిజెపి నెమ్మది నెమ్మదిగా టీఆర్ఎస్ పై ముప్పేట దాడి మొదలుపెట్టినట్లు గా అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే..

గత అయిదేళ్లలో ప్రజారంజకంగా పాలించిన కెసిఆర్, రెండవ విడత ముఖ్యమంత్రి కాగానే ప్రజలలో ప్రతికూలతను మూటగట్టుకున్నాడు. ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా జరిగిన ఆత్మహత్యలు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంపొందించాయి. అయితే ఆ సమస్యను మీడియా మరింత పెద్దదిగా చేయకుండా చేయడం లో టిఆర్ఎస్ సఫలీకృతం అయినప్పటికీ బిజెపి మాత్రం ఈ సమస్యను అంత తేలిక గా వదలకూడదు అన్నట్లుగా ఉంది. మొన్నామధ్య ఈ సమస్యపై అమిత్ షా నివేదిక తెప్పించుకోవడానికి ప్రయత్నించగా ఇప్పుడు ఈ సమస్యను పార్లమెంటులో కూడా లేవనెత్తారు. అదేవిధంగా అటవీశాఖ అధికారి పై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన అంశం పై కూడా పార్లమెంటులో ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ వైపు నుండి ఏ చిన్న పొరపాటు జరిగినా, టిఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడటం లేదు అన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో కి బలంగా వెళ్లాయి. ఇటు తెలంగాణా సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా మరొక వైపు రాష్ట్ర స్థాయిలో బలపడడానికి కూడా బిజెపి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని నాయకులకు బిజెపి తలుపులు బార్లా తెరిచి ఉంచి ఉంది.

ఒకవైపు బిజెపిలోకి లీడర్లను చేర్చుకోవడం, మరొకవైపు టిఆర్ఎస్ ఏ పొరపాటు చేసినా దానికి బిజెపి వైపు నుండి పెద్ద ఎత్తున కౌంటర్ ఉంటుందని సంకేతాలు రావడం, టిఆర్ఎస్ అధిష్టానంలో అసహనాన్ని కలిగిస్తున్నట్లు గా సమాచారం. అయితే అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే కలిగిన ఈ పార్టీపై అసహనాన్ని నేరుగా వ్యక్తం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయం కూడా టిఆర్ఎస్ పెద్దల లో కనిపిస్తోంది. దీంతో నేరుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్న ట్టు గా ఎదుర్కొనలేక, అలాగని చూస్తూ వదిలేయ లేక, టిఆర్ఎస్ లో బిజెపి ని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద టి.ఆర్.ఎస్ మీద బిజెపి ముప్పేట దాడి మొదలు పెట్టిందని, టిఆర్ఎస్ చేయబోయే పొరపాట్లను ఒక్కొక్క దాన్ని మెట్టుగా మలుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తన భవిష్యత్తుకు సోపానాలు వేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరి ఈ ప్రయత్నంలో బిజెపి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close