అమరావతిని కాపాడి బీజేపీ క్రెడిట్ పొందుతుందా..!?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచేలా కేంద్రం ద్వారా ఏపీ సర్కార్‌పై ఒత్తిడి చేసి.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో జమ చేసుకునే ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి కోసం.. పెద్ద ఎత్తున పాదయాత్రకు ఏపీ బీజేపీ సిద్ధమయింది. గుంటూరు నుంచి విజయవాడ వరకు.. రాజధాని గ్రామాల మీదుగా.. ఏపీ బీజేపీలోని అన్ని ప్రాంతాల నేతలూ కలిసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర చేయాలని.. దాని ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని.. తమ పోరాటాన్ని ప్రజల దృష్టిలో పడేలా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ… అమరావతి విషయంలో ఓ స్పష్టమైన తీర్మానాన్ని చేసింది.

గతంలో రాయలసీమ డిక్లరేషన్లు చేసి… ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అమరావతికే కట్టుబడి ఉన్నట్లుగా.. స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్మానం చేసింది. దాన్ని కేంద్ర పార్టీకి పంపింది. జేపీ నడ్డా కూడా.. ఎవరు ఏం మాట్లాడినా… రాష్ట్ర పార్టీ తీర్మానమే అంతిమం అని తేల్చేశారు. అంటే బీజేపీ అధికారిక విధానం అమరావతి కొనసాగింపు మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.  ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా.. పర్మిషన్ లేకుండా… ఏ రాష్ట్రంలోనూ.. అటు పుల్ల ఇటు కదలడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది.

ముఖ్యంగా..  సీబీఐ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అయితే.. కేంద్రమే సుప్రీం. మోడీ, షాలు వద్దు అంటే.. ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి ఉండదు. బీజేపీ.. తమ పోరాటాన్ని పీక్స్ తీసుకెళ్లిన తర్వాత.. కేంద్రం ద్వారా..  జగన్ ప్రయత్నాల్ని అడ్డుకుని.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో జమ చేసుకునే ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. పాదయాత్రలతో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close