రాజధాని పోరాటంపై బీజేపీ – జనసేన సైలెంట్..!

భారతీయ జనతా పార్టీ – జనసేన పొత్తు అంత సీరియస్ వ్యవహారంగా లేదని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఫిబ్రవరి రెండో తేదీన లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని గతంలో ప్రకటించి వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో కనీసం ప్రకటన చేయలేదు. అప్పుడే ప్రతి పదిహేను రోజులకో సారి.. బీజేపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం అవుతుందని ప్రకటించారు. అందులో భాగంగా.. 28వ తేదీన సమావేశం ఉంటుందని.. ముందుగానే చెప్పారు. అనుకున్నట్లుగా సమావేశం జరిగింది కానీ.. వారిలో అసలు సీరియస్ నెస్ ఉందా.. అనే డౌట్ వచ్చేలా సమావేశం జరిగింది. తీసుకునే నిర్ణయాలు సంగతి సరే.. అసలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వారు.. బీజేపీ నుంచి ఎవరూ రాలేదు. పురందేశ్వరి, సోము వీర్రాజు బీజేపీ తరపున సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సహా ఎవరూ హాజరు కాలేదు. జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, శివ శంకర్‌, చంద్రశేఖర్‌ హాజరయ్యారు. వైసీపీ, టీడీపీ అధికార దుర్వినియోగంపై పోరాటం చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. బీజేపీ, జనసేన ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చలు జరిపారు. అమరావతి విషయంలో.. ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని.. బీజేపీ – జనసేన చాలా ఆవేశంగా ప్రకటించాయి. కానీ అఇప్పుడు మాత్రం.. అసలైన సమంలో సైలెంటయిన సూచనలు కనిపిస్తున్నాయి.

రెండో తేదీన మార్చ్ వాయిదా వేసుకోడవమే కాదు… రాజదాని గ్రామాల్లో పర్యటిస్తానని.. మీడియాకు లీకులు ఇచ్చిన పవన్ కల్యాణ్ కూడా.. ఆగిపోయారు. అమరావతి హామీతోనే బీజేపీ పొత్తు అని చెప్పుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు.. మోడీ కోసం పొత్తు పెట్టుకున్నా.. దేశం కోసం కలిసి పని చేస్తామని చెబుతున్నారు. స్వభావానికి విరుద్ధంగా… సీఎఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై.. బీజేపీ నేతల కన్నా ఎక్కువగా ఆయనే మద్దతు ప్రకటనలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close