“కేసినో” పోరాటంలోకి బీజేపీ కూడా !

గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారానికి సంబంధించిన రాజకీయ దుమారం అంతకంతకూ పెరుగుతోంది. టీడీపీ ఇప్పటికే ఈ అంశాన్ని పూర్తి హైలెట్ చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగింది. గుడివాడలో కేసీనో జరిగిన కే కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలిస్తామని సోము వీర్రాజు, సీఎం రమేష్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు ఎక్కడిక్కకడ అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లకుండానే దారిలోనే వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు నడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధపడ్డారు.

అక్కడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంత దూరం నడిచిన తరవాత చిన్న ట్రాలీల్ని తీసుకు వచ్చి బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసి అందులో ఎక్కించి తోసుకెళ్లారు. కొడాలి నానికి బీజేపీ అంటే భయమని.. సోము వీర్రాజు మండిపడ్డారు. కేసినో వ్యవహారంలో కొడాలి నానిపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని.. ఆయనను కేబినెట్ నుంచి బర్తర‌ఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసినో వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఆ విషయం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో.. ఎదురుదాడి చేయడానికి కొడాలి నాని బూతులను ఆయుధంగా చేసుకోవడంతో విషయం పెద్దదైపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ కూడా కేసినో వ్యవహారంపై రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close