ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే మోడీ మంత్రం కూడా పనిచేయదా?

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా బిహార్ లో బీజేపీ ఓడిపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలే ఉన్నాయి. అటువంటి అనేక కారణాలలో ఒకటి ప్రజలపై ప్రాంతీయ పార్టీల ప్రభావం. గత మూడు శతాబ్దాలుగా దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా చాలా బలమయిన ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చేయి. మొదట్లో వాటిని ప్రజలు పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రజలపై వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒకానొక సమయంలో దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలను కాదని మనుగడ సాగించలేమని గ్రహించి, యూపియేని ఏర్పాటు చేసుకొని వాటితో పొత్తులు పెట్టుకొని అధికారం నిలబెట్టుకొంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఈ విషయం చాలా ఏళ్ల క్రితమే గుర్తించి ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసుకొని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఎన్నికలలో ప్రాంతీయపార్టీల ప్రభావం గురించి కాంగ్రెస్, బీజేపీలకు కూడా తెలుసు. కానీ బిహార్ రాష్ర్టంలో బీజేపీ బలంగా నిలద్రొక్కుకు పోవడం చేతనే ఆ పార్టీ మోడీ పాపులారిటీ మీద ఆధారపడవలసి వచ్చింది.

బిహార్ లో బీజేపీ ఓడిపోయిననంత మాత్రాన్న కొంపలు అంటుకోవు. కానీ ఈ ఎన్నికలలో బీజేపీ మోడీ పేరు చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగి భంగ పడటం చేతనే బీజేపీకి ఎక్కువ నష్టం కలుగుతోందిని చెప్పవచ్చును. ఇదే అదునుగా కాంగ్రెస్ మరియు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఇక దేశంలో బీజేపీ పని అయిపోయిందని ప్రచారం చేయడం మొదలుపెట్టేసాయి. వాటికి ఆ అవకాశం కల్పించింది బీజేపీయే. కానీ ఒకవేళ బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి ఉంటే, అప్పుడు మాత్రం వేరే ఇతర కారణాల చేతనే బీజేపీ గెలిచింది తప్ప మోడీ ప్రభావం వలన కాదు ఆ విజయం మోడీ అభివృద్ధిని చూసి వేసింది కాదని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చెప్పుకొని ఉండేవి.

వచ్చే ఏడాది నుంచి వరుసగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మొదలయిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దేశంలో మోడీ వ్యతిరేకత పెరిగిపోతున్న కారణంగానే బీజేపీ మున్ముందు జరుగబోయే ఎన్నికలలో ఓడిపోతుందని కాంగ్రెస్ మరియు బీజేపీ వ్యతిరేక శక్తులు జోస్యం చెపుతున్నాయి. కానీ అవి ప్రజలను తప్పు దోవ పట్టించడానికే ఆవిధంగా మాట్లాడుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో బీజేపీ కంటే ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా పాతుకుపోయున్నాయి. వాటిని బీజేపీయే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసి ఓడించలేదు. అందుకే వాటితో పొత్తులు పెట్టుకొంటోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలు బలంగా పాతుకుపోయి ఉన్నాయి. అవికాక ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రజలపై వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కనుక వాటన్నిటినీ డ్డీ కొని బీజేపీ గెలవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. ఆ రాష్ట్రాలలో బీజేపీకి బలం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును.

కనుక ఆ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో గెలవాలంటే ఇప్పటికిప్పుడు బీజేపీని బలపరుచుకోవడం సాధ్యం కాదు కనుక, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలలో ఒక బలమయిన పార్టీతో బీజేపీ పొత్తులుపెట్టుకోవడం ద్వారా బీజేపీ తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చును. ఆలా కాదని మళ్ళీ అక్కడ కూడా మోడీ జపం చేసి గెలిచేద్దామని చూసి భంగపడితే, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తప్పకుండా చాలా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close