గ్రేటర్‌లో బీజేపీ పొలిటికల్ ఆపరేషన్..!

తెలంగాణలో పట్టు సాధించడానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్న భారతీయ జనతా పార్టీ… ముందుగా హైదరాబాద్‌పై దృష్టి పెట్టింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. వచ్చే జనవరిలో కార్పొరేటర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఏ ఎన్నికలూ నిర్వహించే పరిస్థితి లేదు. కానీ.. ముందు ముందు పరిస్థితి మెరుగుపడుతుందని.. ఎన్నికలు జరుగుతాయని ఆశాభావంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు.. ప్రత్యేకంగా హైదరాబాద్ టార్గెట్‌గా రాజకీయం ప్రారభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… కార్యక్షేత్రం హైదరాబాద్ కావడంతో.. ఆయన ఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో పట్టు సాధిస్తే తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని బీజేపీ ముఖ్యనేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి బండి సంజయ్ .. హైదరాబాద్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కలిసి గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించి కేడర్‌ను పెంచుకోవాలని నిర్మయించుకున్నారు. దీని కోసం.. మొత్తం గ్రేటర్‌ను నాలుగు భాగాలుగా విభజించుకుని నలుగురు బాధ్యత తీసుకున్నారు.

హైదరాబాద్ రాజకీయాల్లో ఆరెస్సెస్ తెర వెనుక పాత్ర కీలకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలపడినా.. దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ మాత్రం.. ఖచ్చితంగా ఆరెస్సెస్ దే అయి ఉంటుంది. ప్రణాళికాబద్దంగా .. హైప్ లేకుండా… ప్రచారం చేయడం ఆరెస్సెస్ ప్రత్యేకత. అందుకే.. ఆరెస్సెస్ ముఖ్య నేతలతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వారి అభీష్టం మేరకు.. గ్రేటర్‌లో పార్టీ పదవులు పంపకం చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన శక్తిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌లో వారు బలపడితేనే.. ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close