సుషాంత్ ఆత్మహత్య కేసు బీజేపీకి ఆయుధంగా మారిందా..?

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతోంది. బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. కేంద్రం అంగీకరించింది. అయితే అసలు నేరం జరిగిన చోటు అయిన ముంబై.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో… ఈ ఆత్మహత్య రాష్ట్రాలు.. కేంద్రం మధ్య కొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. బీహార్ పోలీసుల అత్యుత్సాహం ప్రద‌ర్శిస్తున్నార‌ని మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముంబైలో జరిగిన నేరంపై బీహార్ పోలీసులు ఎలా విచారణ జరుపుతారని.. మహారాష్ట్ర ప్రశ్నిస్తోంది.

సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా రెండు నెలలు అవుతోంది. ఆత్మహత్యగా పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. అయితే… ఆ తర్వాత వివాదం అంతకంతకూ పెద్దదవుతూ వస్తోంది. మొదట సుషాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో పేరుకుపోయిన నెపోటిజం కారణం అని విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు రావడంతో… పోలీసులు అరవై మంది సెలబ్రిటీల్ని విచారించారు. అయితే..ఆ తర్వాత అనూహ్యంగా హత్య కోణం బయటకు వచ్చింది. సుషాంత్ సింగ్‌ది హత్య అంటూ ఆరోపణలు ఊపందుకున్నాయి. సుషాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిరోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు.

మరో వైపు బీహార్ పోలీసులు చాలా దూకుడుగా… ముంబై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. సుషాంత్ అకౌంట్‌లో యాభై కోట్ల రూపాయలు ఏమయ్యాయన్న ఆర్థిక కోణంలో ముంబై పోలీసులు విచారణ చేయడం లేదని బీహార్ డీజీపీ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ తరపున డిప్యూటీ సీఎంగా ఉన్న సుశీల్ మోడీ నేరుగా విమర్శలు చేస్తున్నారు. అక్కడ….ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే.. అసలు టార్గెట్ మహారాష్ట్ర సీఎం అన్న ప్రచారం కూడా ఉంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాకరే కుమారుడు… సుషాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు .. ఆ ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాడని కంగనా రనౌత్ లాంటి వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. సీబీఐకి కేసు అప్పగిస్తే.. ఈ విషయంపై.. సీబీఐ దృష్టి పెడుతుంది. అందుకే.. సీబీఐకి.. బీహార్ మీదుగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆపరేషన్ కమల్‌లో భాగంగా.. రాజస్థాన్ తర్వాత మహారాష్ట్రపై బీజేపీ గురి పెట్టిందని చెబుతున్నారు. ఈ క్రమంలో.. సుషాంత్ ఆత్మహత్య కేసు… బీహార్ మీదుగా… ఢిల్లీకి చేరడం.. అందులో ఉద్ధవ్ కుమారుని పేరు వినిపించడం కలకలం రేపుతోంది. సాధారణంగా అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే మాత్రమే సీబీఐ ఆ రాష్ట్రంలో విచారణ చేయాల్సి ఉంటుది. కోర్టులు ఆదేశిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ కోణంలోనే కోర్టు ద్వారా ఆదేశాలు పొందడానికి ప్రయత్నిస్తోందని శివసేన అనుమానిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close