తెలంగాణలో “ఓటు బ్యాంక్” రెడీ చేసుకున్న బీజేపీ !

ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ కీలకం. ఎంత బలమైన వర్గం అండ ఉంటే…పార్టీ అంత బలంగా ఉంటుంది. ఓ సామాజికవర్గం ఏకపక్ష మద్దతు ఇస్తేనే సాధ్యం అవుతుంది. అన్ని రాజకీయపార్టీలకు అదే ప్లస్ పాయింట్. బీజేపీకి తెలంగాణ ఇప్పటి వరకూ అలాంటి ప్లస్ పాయింట్ లేదు. ఇప్పుడు మున్నూరు కాపుల్ని అలా ఓటు బ్యాంక్‌గా చేసుకుని.., బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఆ బలమైన వర్గాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉంది. వరుసగా ఆ సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌‌కు రాజ్యసభకు అవకాశం కల్పించి బీజేపీ తన ఉద్దేశం పక్కాగా స్పష్టం చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మున్నూరుకాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ వర్గం టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉందని భావిస్తున్న బీజేపీ.. దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయ పార్టల జయాపజయాలు నిర్ణయిస్తారు. ఇప్పటికే మున్నూరు కాపులకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీని అన్నీ తామైనడిపిస్తున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఆ వర్గం వారే.

లోక్ సభ ఎన్నికలప్పటీ నుంచి మున్నూరు కాపు ఓట్లు బీజీపీవైపు ఉన్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గెలవటం.. దుబ్బాక, హుజూరాబాద్ లో మున్నూరుకాపు ఓట్లు బీజీపీకి పోలరైజ్ కావటంతో ఈఓటు బ్యాంక్ పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన కేసీఆర్ అదే సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ అది రెండేళ్లే. దీనిపైనా బీజేపీ వ్యూహాత్మక ప్రచారం చేస్తోంది. రెడ్డి, వెలమ వర్గాలకు ఆరేళ్ల కాలం ఇచ్చి బీసీలకు రెండేళ్ల పదవి ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ వచ్చినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close