గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్ చేసేసింది. ఫలితంగా గ్రేటర్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్‌కి మేజిక్ మార్క్‌కి తగ్గట్లుగా సీట్లు లభించలేదు. ఎక్స్ అఫిషియో ఓట్ల దన్నుతోనూ మేయర్ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పూర్తి స్థాయి మెజార్టీతో మేయర్ పీఠం దక్కించుకోవలాంటే.. మజ్లిస్ పార్టీపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రేటర్‌లో బీజేపీ ఓట్ల శాతం… టీఆర్ఎస్ తో పోటాపోటీగా వచ్చింది. అవసరమైన చోట కావాల్సినన్నీ ఓట్లు రాకపోవడంతో..చాలా వరకూ.. సీట్లు కోల్పోయారు. అనేక చోట్ల… చాలా స్వల్ప తేడాతోనే సీట్లు కోల్పోయారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తానేనని బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించుకుంది. టీఆర్ఎస్ అంటే ఇష్టం లేని వర్గాలన్నీ ఏకమై.. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతిచ్చాయి. వరదలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచాయి. వరద ప్రభావిత ప్రాంతాలు అన్ని చోట్లా టీఆర్ఎస్ పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా బీజేపీకి పడింది. ఫలితంగా టీఆర్ఎస్‌తో పోటీగా బీజేపీ సీట్లు దక్కించుకుంది. మజ్లిస్‌కు పాతబస్తీలో ఎదురు లేదని మరోసారి నిరూపితమయింది. బీజేపీతో పోరు ఆ పార్టీకి కలసి వస్తోంది. ఓట్ల పోలరైజేషన్‌కు ఉపయోగపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. హిందూ ఓట్లు చీలేలా.. అభ్యర్థుల్ని నిలబెట్టే వ్యూహంతో మొదటి నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్న ఎంఐఎం.. ఈ సారి కూడా.. అదే వ్యూహంతో ముందడుగు వేసింది. దాదాపుగా సిట్టింగ్ సీట్లన్నింటినీ నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అత్యంత దారుణంగా ఉంది. గత గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లు రెండే గెల్చుకున్నప్పటికీ.. టీఆర్ఎస్‌తో ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడింది. కానీ ఈ సారి కూడా రెండే కార్పొరేటర్ సీట్లకు పరిమితం అయింది.. కానీ ఓట్ షేర్ మాత్రం దారుణంగా పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలతో పోటీ పడలేకపోయింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

గ్రేటర్‌లో బాధ్యతలు తీసుకున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అడిక్‌మెట్‌లో.. మంత్రి సబిత ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్‌ఎస్‌ పరాజయం పాయింది. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్న , ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి నాయిని అల్లుడు కూడా పరాజయం పాలయ్యారు. గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. భారతీయ జనతా పార్టీకి గొప్ప విజయంగా కనిపిస్తున్నాయి. మేయర్ సీటు టీఆర్ఎస్‌కు దక్కవచ్చు కానీ… ఆ పార్టీకి ఆదరణ రాను రాను తగ్గిపోతోందన్న విషయం మాత్రం.. ఫలితాలతో స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ గెల్చినా సంతోషం లేకుండా పోయింది. బీజేపీ ఓడినా గెల్చినంతగా సంబర పడిపోతోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు భవిష్యత్ రాజకీయ పయనానికి ఓ సూచికలా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close