తెదేపాతో తలపడే వారికే కమలం కుర్చీలు!

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలను గమనిస్తే.. రకరకాల సందేహాలు కలుగుతాయి. అటు తెలంగాణలో మిత్రపక్షాలు రెండూ విడివిడిగా బరిలోకి దిగి తొడకొట్టే పరిస్థితి ఉన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భాజపా నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా మాటలు రువ్వుతున్నారు. అయితే పార్టీ వర్గాలను ఆరా తీసినప్పుడు.. ఓ కొత్త విషయం తెలిసి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మిత్రపక్షం కదా అనే సానుభూతితో తెలుగుదేశం పట్ల మెతక వైఖరి అనుసరించడం కాకుండా.. వారితో తలపడుతూ.. సిగపట్లు పట్టగల వారికే రాష్ట్ర అధ్యక్షులుగా కమలదళ సారథ్యం కట్టబెడతారనేదే ఆ సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షులను త్వరలో నియమించాల్సి ఉంది. తెలంగాణలో మూడు టర్మ్స్‌ పదవిని అనుభవించేసిన కిషన్‌రెడ్డి సీజను అయిపోయింది. ఆయన మీద పార్టీ విశ్వాసం కూడా సన్నగిల్లిందనే ప్రచారమూ ఉంది. ఈనేపథ్యంలో కచ్చితంగా పార్టీ నాయకత్వ మార్పు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు , చంద్రబాబునాయుడు పట్ల ఆయన పాలన పట్ల చాలా మెతగ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వద్ద ఉన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకులే పలు సందర్భాల్లో కేంద్రనాయకత్వానికి ఈ మేరకు ఫిర్యాదులుచేశారు. ఆయనకు కొనసాగింపు ఉండకపోవచ్చు.

మరి కొత్త కమల సారధులుగా రెండు చోట్ల కూడా తెలుగుదేశంతో సై అంటే సై అనగల వారినే ఎంపిక చేస్తారని సమాచారం. రాష్ట్ర పార్టీ నాయకత్వ రేసులో ముందంజలో ఉండడానికేనా అన్నట్లుగా ఇప్పటికే తెదేపా మీద కత్తులు దూస్తారనే మార్కు ఉన్న సోము వీర్రాజు గానీ.. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుగానీ.. సరికొత్త పాత విమర్శలకు దిగుతున్నారని అనుకోవాలి. 6వ తేదీన అమిత్‌షా వచ్చేలోగా… తెలుగుదేశాన్ని వీలైనంత తిట్టి.. తమకంటూ ఒక ముద్ర ఏర్పాటుచేసుకుంటే.. తద్వారా.. రాష్ట్ర పార్టీ నాయకత్వం దక్కవచ్చునని పలువురు ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close