ప్రజావేదిక రూ.8 కోట్లు ఉద్యోగులు కట్టాలట..!

మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రజావేదిక నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చిన అధికారుల నుంచి … రూ. 8 కోట్లు వసూలు చేయబోతున్నట్లు ఆయన అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుపై అసెంబ్లీలో అసువుగా మాట్లాడేసిన బొత్స చాలా కీలక ప్రకటనలు చేశారు. అందులో ప్రజావేదిక నిర్మాణానికి ఖర్చు చేసిన.. రూ. 8 కోట్ల వసూలు ప్రకటన కూడా ఉంది. నిజానికి.. ప్రజావేదిక అనేది ప్రభుత్వ నిర్మాణం … ఏదైనా అధికారుల స్థాయిలో.. పలు విభాగాల్లో ఆమోద ముద్రపడి.. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే.. పనులు ప్రారంభమయింది. ఈ క్రమంలో పలు శాఖల అధికారుల ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు వారందరి నుంచి రూ. 8 కోట్లు వసూలు చేస్తానని మంత్రి బొత్స అసెంబ్లీ వేదికగా ప్రకటిచేశారు.

కూల్చివేతతో రూ. 8 కోట్ల ప్రజాధనం వృధా చేశారని విమర్శలను కాచుకోవడానికి.. బొత్స సత్యనారాయణ… అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇంత వరకూ.. ఇలా.. ఓ ప్రభుత్వ వ్యవహారంలో.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పరిహారాన్ని వసూలు చేసిన సందర్భం లేదు. అలాంటి పరిస్థితి వస్తే.. ప్రభుత్వంపై ఉద్యోగులు తిరగబడినా ఆశ్చర్యం ఉండదని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ఉద్యోగుల నుంచి రూ. ఎనిమిది కోట్లు వసూలు చేస్తామని బొత్స చెప్పడం.. సహజంగానే ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు.. ఆ కట్టడం అక్రమ కట్టడమో కాదో.. నిర్ధారణ కాక ముందే.. కూల్చివేశారని.. అది నదీ గర్భానికి 130 మీటర్ల దూరంలోనే ఉందని చెబుతున్నారు.

వైఎస్ హయాంలో కరకట్టపై నిర్మాణలకు ఎందుకు అనుమతులిచ్చారని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ టీడీపీ సభ్యులు బొత్సపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరో వైపు.. ఇదే సందర్భంలో.. బొత్స.. చంద్రబాబుకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆరు నూరైనా.. చంద్రబాబు ఉన్న ఇంటిని కూల్చితీరుతామని ప్రకటించారు. చంద్రబాబు ఇల్లు కూల్చివేత.. ఇతర ప్రకటనల సంగతేమో కానీ.. ఉద్యోగుల దగ్గర్నుంచి రూ. 8 కోట్లు వసూలు చేస్తామన్న బొత్స ప్రకటన మాత్రం.. హైలెట్ అవుతోంది. ప్రకటనకే పరిమితమవుతారా.. ముందడుగు వేస్తారా.. అన్న చర్చ కూడా ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close