రాజధానిలో అవినీతి జరిగిందని చెప్పలేదన్న బొత్స..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధానిపై చేసిన ఆరోపణల్లో.. ఒక్కొక్కదానిపై.. క్లారిటీ ఇస్తూ పోతోంది. ఇంత వరకూ రాజధానిలో లక్షల కోట్ల స్కాములు జరిగాయని.. ఆరోపిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు… తాము అలా చెప్పలేదని కవర్ చేసుకుంటోంది. సాక్షాత్తూ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ… ఇదే మాట చెప్పారు. రాజధాని నిర్మాణాల్లో రూ. 30వేల కోట్ల అవినీతి జరిగిందని తాము ఎప్పుడూ చెప్పలేదని మీడియా ముందు.. తేల్చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో… అమరావతిలో రూ. 9వేల కోట్లకు పనులు పిలిచారని.. రూ. 5,400 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మరి వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎందుకు చేశారంటే… మాత్రం.. బొత్స తనదైన మార్క్ వివరణ ఇచ్చారు. అంత మొత్తం అవినీతికి తలుపులు తెరిచారని చెప్పాం కానీ.. అవినీతి చేశారని చెప్పలేదంటున్నారు.

ఏపీలో సర్కార్ ఏర్పడినప్పటి నుండి.. రాజధానిపై మంత్రులు చేసిన ఆరోపణలకు లెక్కలేదు. లక్షల కోట్లలోనే ఆ ఆరోపణలు ఉండేవి. అవినీతిని వెలికి తీస్తామని.. ఆ తర్వాత రాజధాని నిర్మాణం గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. ఐదు నెలలు దాటినా.. అవినీతిని వెలికి తీయలేకపోయారు కానీ… ఇప్పుడు.. అవినీతి జరిగిందని చెప్పలేదని… నిర్మోహమాటంగా చెబుతున్నారు. అలాంటప్పుడు… పనులు ఎందుకు నిలిపివేశారన్న ప్రశ్న వస్తుంది. అందుకే.. అవినీతికి తలుపులు తెరిచారని.. తాము మూసేస్తామన్నట్లుగా… బొత్స కవర్ చేస్తున్నారు.

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. టీడీపీ నేతలు వందలు, వేల ఎకరాలు కొనుగోలు చేశారని.. ఆరోపిస్తూ.. వైసీపీ ప్రభుత్వం కమిటీలు కూడా నియమించింది. ఆ కమిటీలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో… డాక్యుమెంట్లన్నీ వడపోసి… అమ్మకాలు జరిపిన రైతుల ఇళ్లకూ.. వెళ్లి… వాళ్ల దగ్గర ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుని.. చేయాల్సినంత రచ్చ చేశారు. కానీ ఇంత వరకూ.. ఒక్కటంటే.. ఒక్క ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారమూ బయట పెట్టలేపోయారు. ఇప్పటికి ఐదు నెలలయింది. ఇప్పుడు మాత్రం.. అలాంటివేమీ లేవన్నట్లుగా ప్రభుత్వమే.. ఏదో రూపంలో.. ప్రకటించాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close