ఎన్డీఏలోకి వైసీపీ..! పరోక్షంగా చెప్పిన బొత్స..!

కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయంపై చర్చించడానికే.. జగన్మోహన్ రెడ్డి.. మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతున్నారన్న ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతూండగానే.. మరో వైపు ఏపీ నుంచి .. అలాంటి సంకేతాలను… వైసీపీ నేతలు ఇవ్వడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఏమైనా చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీనికోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని మీడియా ప్రతినిధులను బొత్స ఎదురు ప్రశ్నించారు.

బీజేపీతో దగ్గరగా..దూరంగా లేమని వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు.. ఇంత వరకూ అంతర్గతంగా జరుగుతున్న రాజకీయ ప్రచారానికి ఊతమిచ్చేలా ఉన్నాయి. కేంద్ర కేబినెట్‌లో చేరాలని వైసీపీని.. బీజేపీ ఆహ్వానించిందని.. ఆ మేరకు ఆమోదం తెలియచేయడానికే.. జగన్ ఢిల్లీ పర్యటనలకు వెళ్లారని చెబుతున్నారు. బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యేలోపు… మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు బొత్స.. రాష్ట్ర ప్రయోజనాల కార్డును ప్రయోగించడం కూడా ఇందుకేనంటున్నారు. గతంలో టీడీపీ కూడా.. బీజేపీతో పొత్తును రాష్ట్ర ప్రయోజనాలతో ముడి పెట్టింది.

ఒక్క రూపాయి అదనంగా తీసుకురాలేకపోయింది. వైసీపీ బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉంటున్నప్పటికీ.. కనీసం పోలవరం బకాయిలు కూడా రప్పించుకోలేకపోయింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో చేరేందుకు సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీలో బొత్స అయినా ఎవరైనా కీలకమైన అంశాలపై… ఎలాంటి సంకేతాలు రాకుండా మాట్లాడరు. ఇప్పుడు పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే బొత్స హింట్ ఇచ్చారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close