బ్రహ్మానందం రూటు మారుస్తున్నాడా?

బ్రహ్మనందం వైభవం అంతా గతం. ఇది వరకు ఇంచుమించు ప్రతీ సినిమాలోనూ బ్రహ్మీ ఉండేవాడు. అడిగినంత పారితోషికం ఇచ్చిమరీ బ్రహ్మీ ని టీమ్ లోకి తీసుకునేవారు. బ్రహ్మీ కోసం సెపరేట్ ట్రాకులు రాసుకునేవారు,. సినిమా అంతటినీ తన భుజాలపై వేసుకుని నడిపించేవాడు. ఐతే ఆ రోజులు పోయాయి. నవతరం కమీడియన్ల ముందు బ్రహ్మీ జోరు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏడాదికి పది సినిమాల్లో కనిపించడం కూడా గగనం ఐపోతోంది. ఇప్పుడు బ్రహ్మీ పేరు చెపితే నిర్మాతలు, దర్శకులు భయపడిపోతున్నారు. బ్రహ్మీ ని భరించడం కష్టం అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. బ్రహ్మీ చాప్టర్ దాదాపు క్లోజ్ ఐపోయింది. పైగా బ్రహ్మీ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఈ దశలో బ్రహ్మీ సినిమాల నుంచి శాశ్వతంగా రిటైర్ మెంట్ తీసుకుంటాడని భావించారు. ఐతే.. బ్రహ్మీ ఇప్పుడు రూటు మార్చాడు.

అనారోగ్యం నుంచి కోలుకున్న బ్రహ్మీ.. ఇకపై సినిమాలపై పూర్తిస్థాయిలో ద్రుష్టి పెట్టాలని ఫిక్స్ ఐపోయాడు. అందుకే తన పారితోషికం తగ్గించుకొవాలని నిర్ణయించుకున్నాడట. ఇది వరకు డబ్బుల కోసం చిన్న, చితకా సినిమాల్ని కూడా ఒప్పుకునేవాడు. ఇప్పుడు అలాంటి ప్రాధాన్యం లేని సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాడట. పైగా తన కలల పాత్రలు కొన్ని వున్నాయి. అలాంటి పాత్ర పోషించే అవకాశం వస్తే పారితోషికం లేకుండా కూడా సినిమా చేస్తా అంటున్నాడట. మొత్తానికి బ్రహ్మీ కి పైసలపై యావ తగ్గినట్టే అనిపిస్తోంది. మరి ఈ త్యాగాలు దర్శక నిర్మాతలు గుర్తిస్తారో.. లేదో..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close