మ‌హేష్ డేటూ.. ప్లేసూ ఫిక్స్ చేశాడు

మ‌హేష్ బాబు – బ్ర‌హ్మోత్స‌వం ఆడియో ఎప్పుడు? ఎక్క‌డ‌? ఈ విష‌యంపై మ‌హేష్ ఫ్యాన్స్ కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. మే 1 న తిరుప‌తిలో ఆడియో వేడుక జ‌ర‌పాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని మార్చుకొని ఆడియో వేదిక హైద‌రాబాద్‌కు మార్చింది. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా డేట్ అండ్ ప్లేస్ రెండూ ఫిక్స్ చేసేశాడు. మే 6వ తేదీన హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో బ్ర‌హ్మోత్స‌వం ఆడియో వేడుక నిర్వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే శిల్ప‌క‌ళావేదిక ప‌ర్మిష‌న్లు కూడా తీసుకొన్న‌ట్టు టాక్‌. దాంతో.. ఈ క‌న్‌ఫ్యూజ‌న్‌కు తెర‌ప‌డిన‌ట్టైంది. మే 31న కృష్ణ పుట్ట‌న రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు. అయితే అంత‌కు ముందే ఈ సినిమాని రిలీజ్ అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మే 20న బ్ర‌హ్మోత్స‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close