అమరావతి ఆలయానికి నిధులకోత..! టీటీడీ బోర్డు మొదటి నిర్ణయం..!

36 మందితో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొదటగా తీసుకున్న నిర్ణయం.. అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఆలయాన్ని కుదించడం. గత సర్కార్ అమరావతిలో … రూ. 150 కోట్లతో రెండు విడతల్లో.. అచ్చంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉండేలా.. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టింది. పునాదులు పడ్డాయి. నిర్మాణం కూడా ప్రారంభమయింది. కానీ.. ప్రభుత్వం మారింది. అమరావతి జాతకం కూడా మారిపోయింది. అలాగే.. అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఆలయం కూడా.. చిక్కిపోయింది. అసలు పాలకమండలి ఏర్పడక ముందే.. ప్రభుత్వం ఆలయాన్ని కుదించాలని నిర్ణయం తీసుకుందని బయటకు వచ్చింది. ఇప్పుడు.. తొలి పాలక మండలి భేటీలోనే.. దీనికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత అవసరాల మేరకు రూ.36 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.

అమరావతి ఆలయం వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని.. పలువురు స్వామిజీలు కూడా ప్రభుత్వానికి, టీటీడీకి విజ్ఞప్తి చేశారు. అయితే.. వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక … వైసీపీ కి మద్దతుగా నిలిచిన స్వామీజీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిందూత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయలేదు. తొలి పాలక మండలి భేటీలో 190కిపైగా నిర్ణయాలు తీసుకున్నా… తొలి సమావేశం కాబట్టి.. బయటకు చెప్పలేమని వైవీ సుబ్బారెడ్డి.. కొన్నింటిని మాత్రమే.. వెల్లడించారు. తిరుమలలో నీటి సమస్య పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామని.. అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను… బాలాజి రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లిస్తామని ప్రకటించారు.

తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత… టీటీడీ నిధులను కేటాయించడం సమంజసం కాదని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జంబో పాలక మండలి తొలి భేటీ గందరగోళంగా ముగిసింది. ప్రమాణస్వీకారాల హడావుడి , సంప్రదాయాలు.. అధికారుల హడావుడి అన్నీ కలిసిపోయాయి. సభ్యులందరిలో శేఖర్ రెడ్డి హైలెట్ గా నిలిచారు. తనపై కేసులేమీ లేవని.. నోట్ల రద్దు సమయంలో సీబీఐ అధికారులకు తన వద్ద రూ. 12 లక్షలు మాత్రమే దొరికాయని… ఇక తనపై ఆరోపణలను నిలిపివేయాలని ఆయన మీడియాను కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close