బుర్రా చేతికి క‌న్న‌ప్ప ?

భ‌క్త క‌న్నప్ప స్క్రిప్టు చేతులు మారుతోంది. మిథునం త‌ర‌వాత‌… క‌న్న‌ప్ప క‌థ‌ని వెండి తెర‌కెక్కించాల‌ని భావించారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ముందు సునీల్‌ని హీరో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విష్ణు చేతికి చేరింది. `ఈ క‌థ మాకు ఇచ్చేయండి.. మేం వేరే ద‌ర్శ‌కుడిని చూసుకొంటాం` అన‌డంతో భ‌ర‌ణి ఈ క‌థ‌ని మంచు ఫ్యామిలీ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఈ స్క్రిప్టులోనూ మార్పులూ చేర్పులూ చోటు చేసుకోబోతున్నాయి. ఈ క‌థ‌ని ఇప్పుడు బుర్రా సాయిమాధ‌వ్ చేతిలో పెట్టార‌ని టాక్‌. భ‌ర‌ణి రాసిన సంభాష‌ణ‌ల్ని బుర్రా తిర‌గ రాస్తున్నాడ‌ని తెలుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మిపుత్ర లాంటి సినిమాల‌కు ప‌దునైన సంభాష‌ణ‌లు అందించారు బుర్రా. ఆ న‌మ్మ‌కంతోనే.. మోహ‌న్ బాబు బుర్రా చేతికి ఈ క‌థ‌ని అంద‌జేశార‌ని తెలుస్తోంది. 2018 ప్ర‌ధ‌మార్థంలో క‌న్న‌ప్ప సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఈ చిత్రానికి మోహ‌న్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.