“నేటి సిద్ధార్థ”.. “ఐటీ” వలకే బలయ్యాడా…?

కెఫే కాఫీడే ఓనర్ సిద్ధార్థ.. అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్త. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తర్వాత నేత్రావతి నదిలో కనుగొన్నారు. ఆయన అదృశ్యం అయినప్పటి నుంచే .. సిద్ధార్థ విజయవంతమైన వ్యాపారవేత్త కాదని.. ఆయనది ఫెయిల్యూర్ స్టోరీ అని..ప్రచారం చేస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్నది… ఆదాయపు పన్ను శాఖ అనే ఆరోపణలు వెల్లడవుతున్నాయి. దానికి సంబంధించిన ఒక్కో అంశం బయటకు వస్తోంది.

అప్పులు తీర్చుకోకుండా ఐటీ అడ్డుకుందా..?

కేఫ్‌ కాఫీ డేకి వేల కోట్లు అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చడానికి వీజే సిద్ధార్థ.. మైండ్ ట్రీ అనే కంపెనీలో తనకు ఉన్న షేర్లను.. రూ. మూడు వేల కోట్లకు అమ్మేసుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ముందుకు సాగనీయకుండా.. ఐటీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. డీల్‌కు ముందు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖ దాడులు చేసి… మైండ్‌ ట్రీ షేర్లను సీజ్‌ చేశారు. ఆదాయ పన్ను చెల్లిస్తానని చెప్పినప్పటికీ సీజ్‌ చేశారని.. ఎన్నో ఆస్తులు ఉన్నా… డీల్‌కు ముందు మైండ్‌ ట్రీ షేర్లనే సీజ్‌ చేయడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. కనీసం నోటీసు ఇవ్వకుండా ఐటీ శాఖ అధికారులు మూడు వేల కోట్ల విలువైన మైండ్‌ ట్రీ షేర్లను సీజ్‌ చేశారు. కేవలం రూ. 625 కోట్ల ట్యాక్స్‌ కోసం మూడు వేల కోట్ల షేర్లను సీజ్‌ చేయడం వ్యాపారవర్గాలను కూడా షాక్‌కు గురి చేసింది.

డీల్స్‌ను అడ్డుకునేందుకే షేర్లను సీజ్ చేశారా..?

పన్నులు కట్టిన తర్వాత మైండ్‌ ట్రీ షేర్లను విడుదల చేసిన ఐటీ అధికారులు ఆ వెంటనే కేఫ్‌ కాఫీ డే షేర్లను సీజ్‌ చేశారు. కేఫ్‌ కాఫీ డే చైన్‌ను కోకకోలాకు అమ్ముకునేందుకు సిద్ధమైన సమయంలోనే ఈ కంపెనీ షేర్లను సీజ్‌ చేసినట్లు భావిస్తున్నారు. సిద్ధార్థ సన్నిహితులు. ఓ వైపు అప్పుల భారం, మరోవైపు ప్రైవేట్‌ ఈక్విటీల నుంచి ఒత్తిడి కారణంగా సూచిస్తోంది సిద్ధార్థ రాసిన లేఖ. ఐటీ శాఖ అధికారులు మాత్రం అది ఎవరు రాశారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. తాము నిబంధనలకు అనుగుణంగా వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తంగా సిద్ధార్థ వ్యవహారం.. ఇప్పడు బిజినెస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి వీజే సిద్ధార్థ వ్యవహారంలో.. బయటకు తెలియాల్సింది చాలా ఉందని.. చెబుతున్నారు.

ఐటీ కేంద్రంగా వస్తున్న ఆరోపణలకు సమాధానాలేంటి..?

వీజే సిద్ధార్థపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు ఈక్వీటీ ఉన్న వారితో… ఐటీ అధికారులు కమ్మక్కయి.. సిద్ధార్థను.. ఇలా ఆర్థికఇబ్బందుల్లో పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలో వాటలను ఇతరులకు అమ్మకుండా… తామే కైవసం చేసుకునే కుట్ర చేశారన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఏం జరిగినా.. ఇదంతా.. ఐటీ శాఖ వల్లే జరగిందనే అభిప్రాయం బలపడటంతో.. నేటి సిద్ధార్థ.. అలా బలైపోయాడా.. అనే సానుభూతి అంతటా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close