‘పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిస నీవు’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. దీని అర్థం… ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని. నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని. లేనిపక్షంలో ఏం జరుగుతుందో… టీవీ5-తెలుగు సినిమా పరిశ్రమ వివాదంలో త్వరలో ప్రజలు చూడవచ్చు. ప్రత్యేక హోదా అంశంలో తెలుగు సినిమా పరిశ్రమ స్పందించడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం… బదులుగా రెండు మూడు రోజుల నుంచి పోసాని కృష్ణమురళి ఫైర్ కావడం తెలిసిన విషయాలే. ఈ నేపథ్యంలో పోసానిని తీసుకువచ్చి టీవీ5 ఛానెల్ లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. లైవ్లో నటీమణుల గురించి మాట్లాడే సమయంలో యాంకర్ అసభ్య పదజాలంతో ఉపయోగించారు. నటులను కించపరిచే విధంగా మాట్లాడారు. దీనిపై తెలుగు సినిమా పరిశ్రమ గరమ్ గరమ్ అవుతోంది.
“మీ సినిమా పరిశ్రమలో లం… లేరా? మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎలా సంపాదించారో తెలియకుండా సంచులు తెస్తే చాలు… వాడు ఇన్కమ్ టాక్స్ ఎగ్గొట్టడా? జీఎస్టీ ఎగ్గొట్టాడా? రియల్ ఎస్టేట్ బ్రోకరా? నోట్లు మార్చాడా? అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకుని నటించేవారు లేరా? నిర్మించేవారా లేరా? దర్శకత్వం వహించే వారు లేరా? మీలా మాటలు రాసేవారు లేరా?” – ఇది పోసానితో యాంకర్ మాట్లాడిన మాట.
నటీమణులను వేశ్యలతో పోల్చడం, సినిమా పరిశ్రమను తక్కువ చేసి చులకన చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు కోపంతో వున్నారు. దీనిపై కంప్లయింట్ ఇచ్చారు .