సీబీఐ సీరియల్ లో క్లైమాక్స్.. ! అలోక్ వర్మ గుడ్ బై ..!

సీబీఐ సీరియల్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ పదవి నుంచి తప్పించిన అలోక్ వర్మ.. రాజీనామా చేసేశారు. తనకు కేటాయించిన ఉద్యోగంలో చేరకుండా… అసలు ఉద్యోగానికే రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. తనకు సహజ న్యాయసూత్రాలను కూడా వర్తింప చేయకుండా.. అవమానించారని.. అలోక్ వర్మ ఆరోపిస్తున్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపైనే తనపై చర్య తీసుకున్నారని అలోక్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేసి.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరో వైపు మళ్లీ మధ్యంతర సీబీఐ డైరక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు.. అలోక్ వర్మ… బదిలీ చేసిన ఐదుగురు అధికారులను .. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశించారు. అలోక్ వర్మ బదిలీలను రద్దు చేశారు.

మరో వైపు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్ధానాతో పాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్‌ దేవేందర్‌ కుమార్‌, దళారి మనోజ్‌ ప్రసాద్‌లపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు ఆస్ధానా సహా ఇతరులపై నమోదైన కేసు విచారణను పది వారాల్లోగా పూర్తిచేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే.. రాకేష్ ఆస్థానాపై ఉన్న ఆరోపణలు.. ఆయనకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల… ఆయనకు వచ్చే ఇబ్బందేమీ లేదని భావిస్తున్నారు. అయితే సీబీఐ డైరక్టర్ అయ్యే అవకాశాన్ని మాత్రం కోల్పోతారు.

మరో వైపు.. సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ తొలగింపు వ్యవహారం.. కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమయింది. రాఫెల్ స్కాంలో ఎప్ఐఆర్ నమోదు చేస్తారనే భయంతోనే మోదీ ఉన్న పళంగా బదిలీ చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close