టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ..! అసెంబ్లీకే పోటీ..!

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.. తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపుగా ఖరారయింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన ఆయన.. అప్పట్నుంచి రెండు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. ఏదైనా పార్టీ నుంచి ఆహ్వానం వస్తే.. చేరాలని అనుకున్నారు. బీజేపీ, జనసేన ఆహ్వానించాయి కానీ.. ఆయన చేరలేదు. ఇప్పుడు.. తెలుగుదేశం పార్టీ ఆయనను ఆహ్వానించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి.. టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా టీడీపీలోకి రావడానికి అంగీకరించారు. భీమిలి అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు గంటా, లోకేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే.. వీవీ లక్ష్మినారాయణ కోసం వీరిద్దరూ పక్కకు తప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు.

జేపీ స్థాపించిన లోక్‌సత్తా పార్టీని ఆయన నడిపిస్తారని… ప్రచారం జరిగింది. కానీ.. సొంత పార్టీని పెట్టుకోవడం అంత ఈజీ కాదని అర్థమయింది. అందుకే ఆయన… టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో.. ఆయన వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కలిశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను కలిసి సంఘిభావం తెలిపారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించి.. ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సమావేశమయ్యారు. రైతుల కోసం ఏదైనా చేయాలన్న ఆశయంతో ఆయన ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే వ్యవసాయ మంత్రిని అవుతానని గతంలో చెప్పేవారు.

సీబీఐ జేడీ చేరికను.. టీడీపీ వర్గాలు దాదాపుగా నిర్దారించాయి. అయితే పోటీ చేసే స్థానంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నాయి. ఆయన స్థాయికి..ఎంపీ సీటు కరెక్ట్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ, ఒంగోలు ఎంపీ స్థానాలను… కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. బహుశా… అసెంబ్లీకి కాకపోతే… పార్లమెంట్‌కు పోటీ చేయాల్సి వస్తే.. ఆయనను ఈ రెండు చోట్ల ఒకచోట నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close