ఛోటా రాజన్ నేడు భారత్ కి తిరిగి తీసుకువచ్చే అవకాశం?

రెండు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న అంతర్జాతీయ క్రిమినల్, మాఫియా డాన్ ఛోటా రాజన్ పదిరోజుల క్రితం ఇండోనేషియాలోని బాలిలో పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. అతనిని ఈరోజు భారత్ కి తిరిగి తీసుకురాబోతున్నట్లు డిల్లీలో అధికారులు తెలిపారు. అతనిని బాలి నుంచి మొదట డిల్లీకి తీసుకువస్తారు. పాస్ పోర్ట్ ఫోర్జరీ కేసులో అతనిని సిబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. వారి విచారణ ముగిసిన తరువాత అతనిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్ అధికారులకు అప్పగిస్తారు. వారు అతనిని ముంబై తరలిస్తారు. అతనిపై సుమారు 70కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో తీవ్రమయిన నేరాలకు పాల్పడినవి చాలా కేసులున్నాయి. అతని కోసం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గత రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్ళకి అతను వారి చేతికి చిక్కబోతున్నాడు.

సిబీఐ, ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్, డిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు ప్రస్తుతం బాలిలోనే ఉన్నారు. అతనిని భారత్ తీసుకురావడానికి అవసరమయిన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి ఇండోనేషియా ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. బహుశః ఇవ్వాళ్ళ సాయంత్రంలోగా అతనిని డిల్లీకి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. అతను మొదట్లో దావూద్ ఇబ్రహీం వద్ద పనిచేసేవాడు. 1993లో ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ తరువాత దావూద్ నుండి విడిపోయి స్వంతంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నాడు. అప్పటి నుండి ఆ రెండు గ్రూపులు చాలా సార్లు పరస్పర దాడులు చేసుకొన్నారు. ఛోటా రాజన్ న్ని హతమార్చేందుకు దావూద్ గ్యాంగ్ చాలాసార్లు ప్రయత్నించింది కానీ రాజన్ తప్పించుకోగలిగాడు. అందుకే అతను మొదట భారత్ వచ్చేందుకు నిరాకరించాడు. కానీ తరువాత ఏమయిందో గానీ తను ఎవరికీ భయపడబోనని భారత్ రావడానికి తనకేమీ భయం, అభ్యంతరాలు లేవని చెప్పడంతో భారత్ అధికారుల పని సులువయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close